Maruthi800
మధ్యతరగతి వారి కారు మారుతీ సుజుకీ పుట్టి 40 ఏళ్లు పూర్తయ్యింది.. సామాన్యుడికి కారు వైభోగం కల్పించింది ఈ బ్రాండ్ కారే. అప్పటి వరకూ కారు అంటే సంపన్నులకు మాత్రమే అందుబాటులో ఉండే విలాస వాహనం.. మారుతి 800 ఆవిష్కరణకు ముందు వరకూ కార్లంటే అంబాసిడర్, ప్రీమియర్ పద్మినీ బ్రాండ్ కార్లే.. వీటిలో అంబాసిడర్ కారు ప్రభుత్వ అధికారుల కారుగా ముద్ర పడిపోయింది. ప్రధాని నుంచి చీఫ్ జస్టిస్ వరకూ ఇవే కార్లలో తిరిగేవారు. నేటికీ చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ కార్లు ఉంటాయి. ప్రధాని నుంచి కలెక్టర్ల వరకూ అందరు ప్రభుత్వాధికారులు ఇవాల్టికి ఆ పాత కాలపు అంబాసిడర్ కార్లనే వాడుతున్నారంటే అవి ఎంతలా బ్రాండ్ అయ్యాయో అర్ధం చేసుకోవచ్చు. అలాంటి టైమ్ లో సామాన్యుడు కూడా కారు లో తిరగాలన్న ఆలోచన ఇందిర ప్రభుత్వానికి రావడం కార్ల తయారీ రంగ పరిశ్రమను ఓ కుదుపు కుదిపింది. ఆ ఆలోచనల నుంచి పుట్టిందే మారుతి 800. ఇది ఒకరకంగా చెప్పాలంటే సామాన్యుల కారు లేదా పీపుల్స్ కార్.
మారుతీ కారు సంజయ్ మానస పుత్రికా? Maruthi800
మారుతీ సుజుకీ కారుని ఇండియన్ రోడ్లపై కి తెచ్చినది సంజయ్ గాంధీ అని చాలా మంది అంటుంటారు. ఒక్కోసారి కొందరి పేర్లు అలా ప్రచారంలోకి వచ్చేస్తాయి. కానీ మారుతీ కార్ల తయారీపై అంతకుముందే అంటే1950లలోనే తీవ్రంగా చర్చ జరిగింది. సామాన్యుడికి అందుబాటులో కారు తేవాలని అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ తలచారు.1983కన్నా ముందు కూడా మన దేశం కార్ల మాన్యుఫాక్చరింగ్ మొదలు పెట్టింది. అయితే పీపుల్స్ కార్ కాన్సెప్ట్ పై చర్చ జరుగుతుండటం, అప్పటికే మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి కార్ల తయారీ ప్రాజెక్ట్ పై స్టడీ చేస్తున్న సంజయ్ గాంధీ ఈ పీపుల్స్ కార్ తయరు చేయాలని ఉబలాటపడటంతో కార్ల తయారీ ఆలోచన వేగం పుంజుకుంది. అప్పటికి ఆయన రోల్స్ రాయస్ కార్ల తయారీలో మూడేళ్లు ట్రైనింగ్ కూడా పొందారు. మరోవైపు చిన్న కార్ల తయారీ దార్ల కోసం భారత ప్రభుత్వం కూడా వేట మొదలు పెట్టింది. ఆ తర్వాత పదేళ్లకు మారుతీ కంపెనీ కారు పట్టాలెక్కింది. ఈ కార్ల తయారీకి అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న 18 మంది తయారీ దార్లలో సంజయ్ గాంధీ ఒకరు. అప్పటికి లైసెన్స్ రాజ్ విధానం నడుస్తోంది కాబట్టి.. అందులోనూ ప్రధాని కొడుకు కాబట్టి ఆయనకు లైసెన్స్ వేగంగా వచ్చింది.
సంజయ్ కు సొంత గ్యారేజ్
ఓల్డ్ ఢిల్లీలోని రోషనారాబాగ్ లో ఓ రెంటెడ్ కార్ల గ్యారేజ్ లో ఆయన కార్ల తయారీ ప్రాజెక్ట్ మొదలు పెట్టారు. అయితే తన మెకానికల్ ఇంజనీరింగ్ సామర్ధ్యం దానికి సరిపోదని అర్ధమైంది. ఆ తర్వాత మరింత అధ్యయనం చేసి మారుతీ కార్ల ఫ్యాక్టరీ పెట్టాలని డిసైడ్ అయ్యారు. గురుగావ్ లోని 297 ఎకరాలను ఎకరా 12 వేల రూపాయలకు స్థలం కొని ఆయన తన కార్ల తయారీ ఫ్యాక్టరీ పెట్టారు. మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండేలా మొదట 8వేల రూపాయలకే మారుతీ సుజుకీని తీసుకు రావాలని మొదలు పెట్టినా అదికాస్తా చివరికి షోరూం ధర కాకుండా రూ. 16,500 అయ్యి కూర్చుంది. హర్యానాలో దాని ధర రూ.21 వేలు చేరుకుంది. మారుతీ సుజుకీ కారు ధర పెరిగినా ఇతర కార్లతో పోలిస్తే దాని ధర ఐదు నుంచి పదివేల రూపాయలు తక్కువగానే ఉండేది. కార్ల తయారీ వేగం పెంచాలని అనుకున్నా సంజయ్ ఫ్యాక్టరీ అనుకున్న టార్గెట్ ను రీచ్ కాలేకపోయింది. నెలకు 12నుంచి 20 కార్లను తయారు చేయాలని అనుకున్నా.. సాధించలేకపోయారు సంజయ్.. 1976 మార్చినెలనాటికి ఆయన కేవలం 21 కార్లను మాత్రమే తయారు చేయగలిగారు. ఆ తర్వాత ఎమర్జెన్సీ విధింపుతో ఈ ప్రాజెక్టు మరింత డిలే అయ్యింది.
సుజుకీ కంపెనీతో ఒప్పందం Maruthi800
1977 ఎన్నికల్లో ఇందిర ఓడిపోవడం, మారుతి కంపెనీని మూసేయాలని కోర్టు ఉత్తర్వులు రాడంతో ప్రాజెక్టు అటకెక్కింది. 1980లో ఇందిరాగాంధీ మళ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టాక ఒక చట్టం ద్వారా మారుతీ కార్లకంపెనీ తయారీని ప్రభుత్వం తన పరిధిలోకి తీసుకుంది. అయితే అప్పటికే సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో మరణించారు. ఆ తర్వాత మూడేళ్లకు జపాన్ కుచెందిన సుజుకీ కంపెనీతో ఒప్పందంకుదుర్చుకుని 1983లో మారుతీ కార్ల తయారీ మళ్లీ మొదలైంది. అయితే మారుతీ800 అనే పేరును జపాన్ టై అప్ కారణంగా మారుతీ సుజుకీ కింద మార్చారు. సంజయ్ గాంధీ డిజైన్ చేసిన మోడల్ కు మరిన్ని మార్పులు చేసి సరికొత్త కారు రూపొందింది. ఆ తర్వాత మధ్యతరగతివారి కలల కారుగా పేరు తెచ్చుకుంది. ఏదైనా ఈకార్లు అందుబాటులోకి తెచ్చిన ఘనత ఇందిర కుటుంబానికే దక్కుతుంది. ఎందుకంటే ఇందిరా, ఆతర్వాత రాజీవ్ కూడా ఈ కార్ల తయారీని బాగా ప్రమోట్ చేశారు. Maruthi800