T20
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టీ20 మ్యాచులో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెలరేగిపోయాడు. సెంచరీతో చెలరేగి భారత స్కోరును 200ల మార్కు దాటించాడు. సూర్యకుమార్ యాదవ్. స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. 55 బంతుల్లోనే శతకం చేశాడు. ఈ క్రమంలో పలు రికార్డులను బద్దలు కొట్టాడు సూర్యకుమార్ యాదవ్. టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ, గ్లెన్ మ్యాక్స్వెల్ రికార్డును సమం చేశాడు. సూర్య కుమార్ ఇప్పటివరకు 4 సెంచరీలు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ టీ20 కెరీర్ ను పరిశీలిస్తే ఈ ఆటగాడు 60 అంతర్జాతీయ టీ20 మ్యాచ్ల్లో 2141 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్లో సూర్యకుమార్ యాదవ్ సగటు 45.55గా ఉంది. ఇది కాకుండా స్ట్రైక్ రేట్ 171.55. ఇది కాకుండా, సూర్యకుమార్ యాదవ్ టి20 ఫార్మాట్లో 17 సార్లు 50+ పరుగుల మార్క్ను దాటాడు. అలాగే, నాలుగు సెంచరీలు కూడా బాదేశాడు.
నాడు గల్లీ క్రికెటర్.. నేడు ఐపీఎల్ కెప్టెన్ T20
సూర్య కుమార్ యాదవ్ ఒక భారతీయ అంతర్జాతీయ క్రికెటర్. యాదవ్ సెప్టెంబర్ 14, 1990న ముంబయిలో జన్మించాడు. అక్కడే పెరిగాడు. తల్లిదండ్రులు యూపీలోని ఘాజీ పూర్ కు చెందిన వారు. అతను పిళ్లై కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, కామర్స్ అండ్ సైన్స్లో చదువుకున్నాడు. తన మామ వినోద్ కుమార్ యాదవ్ కోచింగ్ లో క్రికెట్ ఆడటం ప్రారంభించాడు యాదవ్. చెంబూరు వీధుల్లో ఆడుతూ ఆట నేర్చుకున్నాడు. 10 సంవత్సరాల వయస్సులో, అతని తండ్రి ఆట పట్ల అతని మొగ్గును చూసి అణుశక్తి నగర్ BARC కాలనీలోని క్రికెట్ క్యాంపులో అతనిని చేర్చాడు. ఆ తర్వాత అతను మాజీ అంతర్జాతీయ క్రికెటర్ దిలీప్ బల్వంత్ వెంగ్ సర్కార్ శిష్యుడిగా చేరాడు. వెంగ్ సర్కార్ మాజీ భారత క్రికెటర్ ,క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ కూడా. కవర్ డ్రైవ్ లకు వెంగ్ సర్కార్ పెట్టింది పేరు.
ఐపీఎల్ వేలంలో ముంబై ఇండియన్స్ కొనుగోలు……
2011 అక్టోబరులో ముంబై తరపున రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసి నప్పుడు యాదవ్ ఒక సాధారణ సభ్యుడు మాత్రమే… ఆ తర్వాత రంజీ ట్రోఫీలో కొంతకాలం పాటు ముంబై క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు. 2014–15 రంజీ ట్రోఫీ సీజన్, ముంబై క్రికెట్ అసోసియేషన్ MCA అతనిని కెప్టెన్సీ నుండి తొలగించింది. అలాగే 2018-19 సీజన్లో అతనిని జట్టు నుండి కూడా తొలగించేశారు. అయితే, MCA సెలక్షన్ కమిటీ అతనిని ఎంపిక చేసి, టోర్నమెంట్ 2019-20కి కెప్టెన్ గా నియమించింది. తన అద్బుతమైన ఆటను చూసి ఐపీఎల్ లో 2012లో ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. ఆ తరువాత ఐపీఎల్ తో 2014 వేలంలో కోల్కతా నైట్రైడర్స్ సూర్యని వేలంలో దక్కించుకుంది. మళ్లీ తిరిగి 2018లో ఐపీఎల్ వేలంలో ముంబై ఇండియన్స్ సూర్య కుమార్ ని కొనుగోలు చేసింది.
ప్రేమించిన అమ్మాయే జీవిత భాగస్వామి T20
2023లో ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగిన అతను ఒక అరుదైన ఘనత సాధించాడు. టీ20 అంతర్జాతీయ క్రికెట్లో ఓపెనర్ గా అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాడిగా కూడా సూర్య రికార్డ్స్ నెలకొల్పాడు. ఒక ఏడాదిలో అత్యధిక టీ20 అంతర్జాతీయ సిక్సర్లు కొట్టిన ఆటగాడు కూడా అతనే. సూర్యకుమార్ యాదవ్ 2021లో భారత క్రికెట్ జట్టులో అంతర్జాతీయ వన్డే క్రికెట్లో అరంగ్రేటం చేసి తొలి ఆరు మ్యాచ్ల్లో 30కి పైగా పరుగులు చేసిన తొలి బ్యాటర్ గా ప్రపంచ రికార్డు సాధించాడు. ఇక సూర్య ప్రేమకథ విషయానికి వస్తే, అతను జూలై 2016లో దేవిషా శెట్టిని వివాహం చేసుకున్నాడు. విశేషమేమిటంటే వీరిద్దరూ కాలేజీలో ప్రేమించుకున్నారు. సూర్య దేవిషాకు ప్రపోజ్ చేయడం, ఆమె కూడా అంగీకరించడం, ఇరువైపుల పెద్దలు కూడా ఆశీర్వాదం తెలపడంతో పెళ్లిపీటలెక్కారు.
సూర్యకు పలువురి ప్రశంసలు
ఇప్పటి వరకు జరిగిన టోర్నీల గురించి మాట్లాడుకుంటే భారత జట్టు కెప్టెన్, ఆటగాళ్లు, కోచ్లు, మాజీ ఆటగాళ్లు సూర్య కుమార్పై ప్రశంసలు జల్లులు కురిపించారు. తాజాగా టీమ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సూర్య ప్రపంచంలోనే నంబర్ వన్ టీ20 బ్యాట్స్మెన్ గా కొనియాడాడు. అతను నిలకడగా గొప్ప స్ట్రైక్ రేట్తో పరుగులు చేస్తాడు. అతడు ఇంకా ఎన్నో మైలురాళ్లను దాటుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉండగా ఒక ఏడాదిలో టీ20 ఫార్మాట్ లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్ మెన్ గా సూర్య నిలిచాడు. T20