YCP
ఎమ్మిగనూర్ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి చేసిన కామెంట్లు వైసీపీ ప్రభుత్వాని ఇరకాటంలో పడేస్తున్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు పోర్న్ చూడరా? కార్పొరేట్ స్కూళ్లలో విద్యార్ధులు పోర్న్ చూడకుండా ఉంటారా? వారెవరికీ లేని అభ్యంతరం స్కూలు పిల్లలకు మాత్రం ఎందుకు? ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్ధులకు ట్యాబ్ లు ఇవ్వడం తప్పని కామెంట్ చేసే వారిది దుర్మార్గమైన చర్య అంటూ విరుచుకుపడ్డారాయన.. చెన్నకేశవరెడ్డి ఎమ్మిగనూర్ వైసీపీ ఎమ్మెల్యే. ఆయన వయసు 81 సంవత్సరాలు.. అంత పెద్ద వయసులో ఆయన ఈ కామెంట్ చేయడం సంచలనంగా మారింది. అసలే ఎన్నికల కసరత్తులో టిక్కెట్ల కేటాయింపు కసరత్తులో ఉన్న వైసీపీ పెద్దలకు చెన్నకేశవ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు పెద్ద తలనొప్పిగా మారాయి.
స్కూళ్ల రూపురేకలు మార్చిన జగన్ ప్రభుత్వం.. YCP
అసలు విషయంలోకి వెళితే ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్ధులకు ఉచితంగా ట్యాబ్ లు, లాప్ ట్యాప్ లు ఇవ్వడంతో విపక్షాలు పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. జగన్ ప్రభుత్వం నాడు- నేడు పథకంతో స్కూళ్ల రూపు రేఖలను సమూలంగా మార్చివేసింది. ప్రభుత్వ స్కూళ్లను పిల్లలకు ఆకర్షణీయంగా తీర్చి దిద్దడం ద్వారా తొలి రౌండ్ లో విజయం సాధించింది. ఆపై అమ్మఒడి పథకంతో పిల్లల పేరున డబ్బును తల్లులకు ఇస్తూ చదువును ప్రోత్సహిస్తోంది. వారికి ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వడంలో భాగంగా పల్లీ చిక్కిలు, రాగి జావ లాంటి పోషకపదార్ధాలను స్కూళ్ల డైట్ లో చేర్చింది. వాళ్ల స్కూలు పుస్తకాలు, బ్యాగులు, యూనీఫామ్, షూస్ అన్నీ నాణ్యమైనవి ఉచితంగా అందించింది. వీటితో పాటు పిల్లలకు చదువుకోడానికి వీలుగా ల్యాప్ టాప్ లు, ట్యాబులు ఉచితంగా అందించింది. చచ్చుబడిపోయిన ప్రభుత్వ స్కూళ్లు, ప్రాథమిక విద్యకు ఇలాంటి చర్యలతో జవ జీవాలు కల్పించింది. దాంతో పిల్లలు, తల్లులు వైసీపీ ప్రభుత్వానికి జై అంటున్నారు.
ఎంతవరకు నిజం…
ఇదంతా చూసి ప్రతిపక్షాలకు నోట మాట రావడం లేదు.. తమ హయాంలో వీటిలో ఒక్క చర్యను కూడా చేపట్టలేని టీడీపీ, జగన్ అంటే కళ్లలో నిప్పులు పోసుకునే పవన్ కల్యాణ్ ఇద్దరూ కలసి పిల్లలకు ట్యాబులు ఇస్తూ వారిని , వారి కెరీర్ ను పాడు చేస్తున్నారని మండిపడుతున్నారు. బైజూస్ ట్యాబులు పిల్లలకు ఇచ్చారని వారు చదువు మాని గేమ్స్, పోర్న్ కంటెంట్ చూస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఛైల్డ్ లాక్ చేసే వాటిని సప్లయ్ చేశామని, అలాంటిదేమీ లేదని ప్రభుత్వం అంటోంది.
విపక్షాల విమర్శల వెల్లువ… YCP
ఎన్నికలు దగ్గర పడుతున్న టైమ్ లో వైసీపీని ఇరకాట పెట్టడానికి సరైన అంశాలేవీ లేని విపక్షాలు ఈ ట్యాబుల అంశాన్ని లేవదీశాయి. ఇంకేముంది? రామ … రామ.. జగన్ హయాం లో పిల్లలు చెడిపోతున్నారని, చిన్న పిల్లల చేతిలో ట్యాబులు పెట్టేసారనీ విద్యావ్యవస్థ పాడైపోయిందని.. ఇలా ఒకటికాదు.. రెండుకాదు.. ఇష్టమొచ్చినట్లు విమర్శలు చేస్తున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలు దీన్ని గట్టిగానే కౌంటర్ చేస్తున్నారు.. మీ పిల్లలకైతే కార్పొరేట్ చదువు లు కావాలా?.. పేద పిల్లలకు అక్కర లేదా? అని రిటార్ట్ ఇస్తున్నారు. ఇంత వరకూ బానే ఉంది. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్న కేశవరెడ్డి మరో అడుగు ముందుకేసి పోర్న్ ఎవరు చూడరు? ఎంపీలు, ఎమ్మెల్యేలే చూస్తున్నారు.. కార్పొరేట్ స్కూళ్లలో పిల్లలు కూడా చూస్తున్నారు కదా.. అంటూ రివర్స్ అటాక్ చేస్తున్నారు. ప్రభుత్వాన్ని సమర్ధించేందుకు ఇంతకన్నా మెరుగైన కౌంటర్ ఇవ్వలేరా? చెన్న కేశవా ఇది ఏమి నాయనా? అంటూ సొంత పార్టీ కార్యకర్తలే బుగ్గలు నొక్కుకుంటున్నారు. YCP