Diamond Hub
ప్రపంచంలోకే అతిపెద్ద వజ్రాల వ్యాపార కేంద్రంగా రూపుదిద్దుకుంటున్న సూరత్ లో ఈ ఆదివారం అతిపెద్ద వాణిజ్య కార్యాలయం ప్రారంభం అవుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల రాజధానిగా సూరత్ చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. గుజరాత్ లోని సూరత్ లో ఏర్పాటు చేస్తున్న ప్రపంచ అతిపెద్ద వాణిజ్య కార్యాలయం అమెరికాలోని పెంటగాన్ భవనానికన్నా పెద్ద ప్రాంగణం. పెంటగాన్ ను 1943లో 6.5 మిలియన్ల చదరపు అడుగుల ఏరియాలో నిర్మిస్తే సూరత్ లో డైమండ్ బౌర్స్ కేంద్రం విస్తీర్ణం ఏకంగా 6.7 మిలియన్ చదరపు అడుగులు. అంటే సుమారుగా ఆరు లక్షల 20 చదరపు మీటర్లు.. ప్రధాని నరేంద్ర మోడీ దీనిని ఆదివారం సూరత్ లో ప్రారంభించనున్నారు. ఈ వాణిజ్య కేంద్రం ఏర్పాటుతో గుజరాత్ ఆర్ధికంగా పుంజుకుంటుంది. వజ్రాల రాజధానిగా సూరత్ ను తీర్చి దిద్దితే అది గుజరాత్ ఆర్థికపురోగతికి ఎనలేని బాటలు వేస్తుంది.
సూరత్ ది డైమండ్ సిటీ.. Diamond Hub
మనదేశంలో వజ్రాల ఎగుమతికి ఎప్పటినుంచో ముంబై కేంద్రంగా ఉంది. సూరత్ ను కూడా డైమండ్ సిటీ అనే పిలుస్తారు. అయితే ముంబైతో పోలిస్తే సూరత్ లో మరింత విలువైన వజ్రాలు 90 శాతం స్వచ్ఛత కలిగిన వజ్రాలు దొరుకుతాయి. ప్రపంచంలోని 90 శాతం రఫ్ డైమండ్ కట్ వజ్రాలను ఇక్కడ పాలిష్ పెట్టి , సాన బెట్టి కోసి మరింత మెరిసేలా చేస్తారు. ఆ తర్వాతే బాగా సాన పెట్టిన వజ్రాలను అమెరికా, చైనాలలో వ్యాపారులకు అమ్ముతుంటారు. సూరత్ లో ఏర్పాటు చేస్తున్న ఈ కొత్త వజ్రాల వ్యాపార కేంద్రంతో వజ్రాల పరిశ్రమ మొత్తం ఒక గొడుగుకిందకు వచ్చినట్లవుతుంది. సూరత్ వజ్రాల కటింగ్ కు, ఎక్స్ చేంజ్ కు పేరెన్నికగన్న కేంద్రం అని ప్రపంచ వజ్రాల కేంద్రాల సమాఖ్య అధ్యక్షుడు ఎలీ ఇజాన్ కోఫ్ వ్యాఖ్యానించారు. ప్రపంచంలోని అన్ని మూలల నుంచి వజ్రాల డీలర్లు ఇక్కడకొచ్చి నమ్మకమైన సురక్షితమైన వాణిజ్య కేంద్రంలో వజ్రాలు అమ్మొచ్చు.. కొనొచ్చు అని ఇజాన్ కోఫ్ అన్నారు.
ప్రపంచంలోకే అతిపెద్ద వజ్రాల వాణిజ్య రాజధాని Diamond Hub
గుజరాత్ లోని అంతర్జాతీయ ఫైనాన్స్ టెక్ సిటీ తర్వాత అంత ప్రముఖంగా ఈ డైమండ్ రిసెర్చ్ అండ్ వాణిజ్య భవనాన్ని రూపొందించారు. ప్రధాని మోడీ ఫ్లాగ్ షిప్ ప్రాజెక్టుల్లో ఇది ఒకటి. దీనిలో 15 అంతస్థుల చొప్పున9 టవర్లు ఉన్నాయి. వాటిలో 4,700 కార్యాలయాలు ఉంటాయి. ఇప్పటికే 130 కార్యాలయాలు వాడుకలో ఉన్నాయి. సూరత్ లో ఉన్న వజ్రాల వాణిజ్య కేంద్రం ఇజ్రాయెల్ డైమండ్ ఎక్స్ ఛేంజ్ కేంద్రం కన్నా పెద్దది.. ఇజ్రాయెల్ లోని టెల్ అవీవ్ కాంప్లెక్స్ వెయ్యి ఆఫీసులను ఏర్పాటు చేసిన కేంద్రం కాగా ఇందులో ఇన్సూరెన్స్, బ్యాంకులు, పోస్టాఫీస్, కస్టమ్స్ కార్యాలయం, ఎంటర్టైన్ మెంట్, ఫుడ్, మతపరమైన కార్యలాపాల నిర్వహణా కేంద్రాలు ఉన్నాయి.
చరిత్ర పరంగా చూస్తే సూరత్ అరేబియా సముద్ర తీరానికి దగ్గరగా ఉండటంతో బ్రిటన్, నెదర్లాండ్స్, పోర్చుగల్ లాంటి దేశాలతో వాణిజ్య సంబంధాలు కూడా ఉన్నాయి.17,18 శతాబ్దాల్లో ముంబై పోర్టు ఎదుగుదలతో సూరత్ ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. సూరత్ లో ఆరు దశాబ్దాల క్రితమే డైమండ్ పరిశ్రమ పెరుగుతూ వచ్చింది. ఎక్కువ ఆస్ట్రేలియాలో వజ్రాల గనులు ఉండటంతో సూరత్ కు రాకపోకలు పెరిగాయి. 1990లలో భారత్ లో ఆర్థిక సంస్కరణలు తేవడంతో ముంబై లో వజ్రాల వ్యాపారం మరింత విస్తరించింది. సూరత్ కు 280 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముంబైకు ప్రపంచ దేశాలతో ఉన్న కనెక్టివిటీ వల్ల అతిపెద్ద వాణిజ్య కేంద్రంగా ముంబై నిలిచిపోయింది.
తన గుర్తింపు నిలబెట్టుకున్న సూరత్ Diamond Hub
అయితే సూరత్ కు దేశం నలుమూలలనుంచి వజ్రాల వ్యాపారులు, వజ్రాలను మెరుగ పెట్టి సాన పట్టే పనివారు వలస వచ్చి ఇక్కడే స్థిరపడిపోయారు. వీరంతా వజ్రాల పాలిషర్లుగా స్థిరపడ్డారు. 1994లో సూరత్ ను ప్లేగు వ్యాధి కబళించడంతో వర్కర్లంతా సూరత్ వదిలి పారిపోయారు. అయితే ప్లేగు వ్యాధిని నియంత్రించాక గుజరాత్ ప్రభుత్వం పాలనా యంత్రాంగాన్ని, మౌలిక వనరులను పునర్నిర్వచించి మళ్లీ దారిలో పెట్టింది. దాంతో మళ్లీ వ్యాపారం పుంజుకుంది.
నేటికీ సూరత్ దేశంలోకే అత్యంత పరిశుభ్రమైన నగరంగా గుర్తింపు పొందింది.
సూరత్ వెళితే నేటికీ షాపుల్లో వజ్రాల వర్కర్లు డెస్కులపై విలువైన రాళ్లను విద్యుత్ కాంతుల మధ్య పరిశీలిస్తూ, సాన పెడుతూ కనిపిస్తారు. మరికొందరు సాన పెట్టిన వజ్రం మెరుస్తోందో లేదో చూసేందుకు ఆరుబయట వాకిట్లో నిలబడి ఎండలో వాటిని పరిశీలిస్తుంటారు. ఇక చిన్నా చితకా వ్యాపారులైతే విలువైన రంగురాళ్లను తెల్లని పేపర్లలో చుట్టి, చిన్న చిన్న సంచుల్లోనూ మూటకట్టి షర్టు జేబులో పెట్టుకు తిరుగుతూ కనిపిస్తారు. సూరత్ లో ఏమూల చూసినా మనకి ఇవే దృశ్యాలు కనిపిస్తాయి. సూరత్ లో అతిపెద్ద వజ్రాల వాణిజ్య భవనాన్ని నిర్మించడం ద్వారా మోడీ ప్రభుత్వం ఆర్థిక పురోగతికి బాటలు వేసింది.