IPL17
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 17 వేలం ప్రక్రియ రేపు జరుగుతుంది. దుబాయ్లోని కోకాకోలా ఎరీనాలో జరిగే ఈ యాక్షన్ లో మొత్తం 333 మంది ఆటగాళ్లను వేలం వేయనున్నారు. అయితే వీరిలో 77 మంది ఆటగాళ్లకు మాత్రమే అవకాశం దక్కనుంది. వీరిలో కొందరికి మాత్రమే అవకాశం దక్కుతుంది. మొత్తం పది ఐపీఎల్ జట్లు ఈ వేలానికి పూర్తిగా సన్నద్ధమయ్యాయి.
మెగా వేలం.. మినీ వేలానికి తేడా ఏంటి…
మెగా వేలంలో కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. మెగా
వేలంలో ముగ్గురు నుంచి ఐదుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకోవచ్చు. కానీ ప్రస్తుతం జరిగేది మినీ వేలం. ఇందులో ఎంత మందినైనా ఫ్రాంఛైజీలు రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. లిమిట్ ఉండదు.
ఒక్కో ఫ్రాంఛైజీ ఎంత ఖర్చు చేయవచ్చు… IPL17
ఒక్కో ఫ్రాంచైజీకంపెనీ 75నుంచివంద కోట్లరూపాయలవరకూ వేలంలో ఖర్చు చేయవచ్చు..
వేలంలో పాల్గొనే పది ఫ్రాంఛైజీల వద్ద మొత్తంగా రూ.100 కోట్ల పర్స్ ఉంటుంది. అందులో ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్ల కోసం ఖర్చు చేసింది పోగా.. మిగతా డబ్బుతో వేలంలో పాల్గొనాల్సి ఉంటుంది. అయితే డబ్బు ఉన్నా ఆటగాళ్లను కొనకుండా ఉంటామంటే కుదరదు. ప్రతీ ఫ్రాంఛైజీ కనీసం 75% వెచ్చించాల్సి ఉంటుంది. అంటే రూ.75 కోట్లు ఖర్చు చేయాల్సిందే. గరిష్టంగా రూ.100 కోట్ల వరకు వేలంలో ఖర్చు చేయవచ్చు.
ఐపీఎల్ 2024 వేలంలోని కేటగిరీలు ఏవి…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 వేలంలో ఆటగాళ్లను మొత్తంగా 3 కేటగిరీలుగా విభజించారు. అవి 1.క్యాప్డ్
ప్లేయర్లు, 2.అన్ క్యాప్డ్ ప్లేయర్లు, 3.నాన్ ఇండియన్, విదేశీ ప్లేయర్లు, ఓవర్సీస్ ప్లేయర్లు. టీమిండియా తరఫున కనీసం ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన ప్లేయర్లను క్యాప్డ్ ప్లేయర్లు అంటారు. ఇప్పటివరకు భారత్ తరఫున ఆడని ప్లేయర్లే అన్ క్యాప్డ్ ప్లేయర్లు. ఇక మూడో కేటగిరీలో క్యాప్డ్, అన్ క్యాప్డ్ విదేశీ ప్లేయర్లు ఉంటారు.
రైట్ టు మ్యాచ్ రూల్ అంటే ఏమిటి ఈ వేలంలో ఆ రూల్ ఉందా… IPL17
గతేడాది ఐపీఎల్ ఆడి.. ఈ సారి వేలంలోకి వచ్చిన ఆటగాడిని ఎవరైనా సొంతం చేసుకున్నా.. తిరిగి గత ఫ్రాంఛైజీ అదే మొత్తాన్ని చెల్లించి వారిని తీసుకునే అవకాశం ఉండటమే రైట్ టు మ్యాచ్ రూల్. ఉదాహారణకు గత సీజన్ వరకు రూ.15 కోట్ల ప్రైజ్తో ముంబయి ఇండియన్స్ జట్టుకు ఆడిన రోహిత్ శర్మ వేలంలోకి వచ్చాడు అనుకుందాం.
ఈ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్.. IPL17
రోహిత్ శర్మను రూ.18 కోట్లకు దక్కించుకున్నా..RTM కార్డ్ ఉపయోగించి
అదే మొత్తం (రూ.18)కోట్లు చెల్లించి ముంబయి అతడిని సొంతం చేసుకోవచ్చు. ఈ కార్డును ఉపయోగించి
2018లో చెన్నై సూపర్ కింగ్స్.. రూ.1.6 కోట్లకు ఫాప్ డుప్లెసిస్ను, ముంబయి ఇండియన్స్ రూ.5.4
కోట్లకు కీరన్ పొలార్డ్ను సొంతం చేసుకున్నాయి.
ఒక్కో ఫ్రాంఛైజీలు గరిష్టంగా ఎంత మంది ఆటగాళ్లను తీసుకోవచ్చు?
ఒక్కో ఫ్రాంఛైజీ దగ్గర రూ.100 కోట్ల పర్స్ ఉంటుంది. అందులో గరిష్టంగా 25 మంది ఆటగాళ్లను తీసుకునే అవకాశం ఉంటుంది. అందులో 17 మంది భారత ప్లేయర్లు ఉండాలి. విదేశీ ప్లేయర్లు 8 మందికి మించి ఉండటానికి వీలులేదు. కనిష్టంగా ఒక్కో జట్టు 18 మంది ప్లేయర్లతో సైతం వేలాన్ని ముగించవచ్చు. IPL17