Tirumala : జనవరి 22న అయోధ్య లో శ్రీ రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవానికి వచ్చిన భక్తులకు పంపిణీ చేసేందుకు టీటీడీ దాదాపు లక్ష లడ్డులను టీటీడీ తయారు చేయించింది. సిద్ధం చేసిన శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని శుక్రవారం రాత్రి తిరుమల లోని శ్రీవారి సేవా సదన్-1 నుంచి తిరుపతి విమానాశ్రయానికి తరలించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వీరబ్రహ్మం తెలిపారు.
అయోధ్యలో జరిగే ‘ప్రాణ్ప్రతిష్ఠ’ వేడుకల నిమిత్తం 25 గ్రాముల బరువు కలిగిన దాదాపు లక్ష లడ్డూలను అయోధ్యకు పంపిస్తున్నటు టీటీడీ తెలిపింది. 350 ప్రత్యేక బాక్సులలో లడ్డూలను ప్యాక్ చేసి అయోధ్యకు తరలించినట్లు తెలిపారు.
అంతకుముందు టీటీడీ ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ గ్లోబల్ ఛారిటీ క్యాంపెయిన్లో భాగంగానే ఈ పంపిణీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ‘పోటు’లో తయారు చేయబడిన ఈ ప్రత్యేకమైన లడ్డూలు అయోధ్యలోని శ్రీ రాముని భక్తులకు పంచనున్నటు అయన తెలిపారు.
‘జై శ్రీరామ్’ అనే నినాదాల మధ్య రామ్ లల్లా విగ్రహాన్ని గురువారం రామాలయంలోని ‘గర్భ గృహ’లో ఉంచారు. జనుఅరీ 22 న జరగనున్న ఉత్సవాల ప్రారంభోత్సవానికి సంబంధించి, బుధవారం రాత్రి క్రేన్ సహాయంతో విగ్రహాన్ని లోపలికి తీసుకువచ్చే ముందు గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అయోధ్య ఆలయంలో రామ్ లల్లా ‘ప్రాణ్ ప్రతిష్ఠ’ కు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి లక్ష్మీకాంత్ దీక్షిత్ నేతృత్వంలోని అర్చకుల బృందం నాయకత్వం వహిస్తుంది.