Tirupati : ఫిబ్రవరి 3న అనంతపురం జిల్లాలో రాయలసీమ ప్రాంత వైఎస్సార్సీపీ “సిద్దం” (Siddham) ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొననున్నారని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి మరియు పుంగనూరు ఎమ్మెల్యే పెద్ది రెడ్డి రామచంద్ర రెడ్డి తెలిపారు. ఈ సభకు సంబంధించిన పోస్టర్లను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం తిరుపతిలో విడుదల చేశారు.
8 జిల్లాలకు చెందిన పార్టీ నేతలు సుమారు 4 లక్షల మంది అనంతపురంలో జరిగే ఈ సభకు తరలి రానున్నారు
రాయలసీమ జిల్లాలకు చెందిన 49 మంది వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు, 8 మంది ఎంపీలతో పాటు చిత్తూరు, తిరుపతి, కడప, అన్నమయ్య, నంద్యాల, కర్నూలు, శ్రీ సత్యసాయి, అనంతపురం తదితర 8 జిల్లాలకు చెందిన పార్టీ నేతలు సుమారు 4 లక్షల మంది అనంతపురంలో జరిగే ఈ సభకు (Siddham) తరలివస్తారని పెద్దిరెడ్డి తెలిపారు.అనంతపురం లో జరిగే వైస్సార్సీపీ సిద్ధం సభకు సంబందించి, జనవరి 29న తిరుపతిలో సన్నాహక సమావేశం జరగనుంది.ఈ సమావేశంలో రాయలసీమ ప్రాంతానికి చెందిన అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులందరు పాల్గొంటారని పెద్ది రెడ్డి తెలిపారు.
తిరుపతి జిల్లాలోని సత్యవేడు (ఎస్సీ) అసెంబ్లీ నియోజకవర్గానికి సంబందించిన వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ ఎం గురుమూర్తి శనివారం నాడు కార్యకర్తలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దాదాపు 3000 మందికి పైగా పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. మరో 75 రోజుల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నేతలంతా డాక్టర్ గురుమూర్తికి అండగా నిలవాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు.