A.P పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్లో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ల ఉద్యోగ రిక్రూట్మెంట్కు సంబంధించిన సిలబస్కు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) సవరణలను చేసింది. మారిన సిలబస్ కు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) డిసెంబర్ 26, 2023న మార్చిన సవరణ నోటీసును జారీ చేసింది.
జనవరి 30, 2024 నుండి ఫిబ్రవరి 19, 2024 అర్థరాత్రి 11:59 గంటల వరకు, అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్లైన్లో కమిషన్ వెబ్సైట్లో https://psc.ap.gov.inలో అప్లై చేయాలనీ ప్రకటించారు.
పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పేపర్-III, ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పై అనేక ఆందోళనలను వ్యక్తం చేసినట్లు కమిషన్ కార్యదర్శి జె. ప్రదీప్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థుల వాదనలపై విచారణ జరిపేందుకు నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేశామని, వారి సూచనల ఆధారంగానే సవరించిన సిలబస్ని రూపొందించామని పేర్కొన్నారు. మారిన కొత్త సిలబస్ ని APPSC కమిషన్ వెబ్సైట్లో చూడవచ్చని ఆయన పేర్కొన్నారు.
జనవరి 30, 2024 నుండి ఫిబ్రవరి 19, 2024 అర్థరాత్రి 11:59 గంటల వరకు, అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్లైన్లో కమిషన్ వెబ్సైట్లో https://psc.ap.gov.inలో అప్లై చేయాలనీ ప్రకటించారు.