భారతదేశానికి ఉమ్మడి పౌరస్మృతి అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఆయన తన మనసులో మాటను కార్యకర్తలతో పంచుకున్నారు. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి పౌరస్మృతి, యూనిఫాం సివిల్ కోడ్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు కొంత సంచలనమయ్యాయనే చెప్పాలి. మేరా బూత్ సబ్ సే మజ్బూత్ పేరుతో మధ్యప్రదేశ్లో భూపాల్లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశానికి మోదీ హాజరయ్యారు.
ఉమ్మడి పౌరస్మృతి…
అయితే ఉమ్మడి పౌరస్మృతితో ముస్లింలను వేరుగా చేసి చూడటం తమ విధానం కాదన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు ముస్లిం సామాజికవర్గాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని ప్రధాని చెప్పుకొచ్చారు. ఎవరో రెచ్చగొడితే ముస్లింలు రెచ్చిపోవద్దని మోదీ తెలిపారు. ఉమ్మడి పౌరస్మృతి వల్ల కలిగే లాభాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత పాలకులపైనా, పార్టీ కార్యకర్తలపైనా ఉందన్న మోదీ, ఆ దిశగా దీనిపై ప్రజల్లో చైతన్యం కల్పిస్తామని మోదీ మధ్యప్రదేశ్ పర్యటనలో చెప్పుకొచ్చారు.
అపోహలొద్దు…
దీనిపై ఎవరూ ఎలాంటి అపోహలు చెందవద్దని మోదీ కోరారు. పార్టీకి కార్యకర్తలే వెన్నుముక అన్న మోదీ వారి కృషి వల్లనే ఇన్ని విజయాలు సాధ్యమయ్యాయని అభిప్రాయపడ్డారు. బూత్ లెవెల్ కార్యకర్తలతో తాను సమావేశం కావడం ఆనందంగా ఉందన్నారు. కార్యకర్తలు కూడా పార్టీ కంటే దేశం ముఖ్యమని భావించాలన్నారు. మధ్యప్రదేశ్లో మరోసారి బీజేపీ జెండా ఎగరేలా చూడాలని కోరారు. అందుకు ప్రతి కార్యకర్త శ్రమించాలని, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
Follow Us On : YouTube , Google News