ఆదివారం ఆంధ్రప్రదేశ్లోని కోనసీమలో శ్యామ్ అనే 20 ఏళ్ల జూ. ఎన్టీఆర్ అభిమాని తన ఇంట్లో శవమై కనిపించాడు. దీని పై కోనసీమ డీఎస్పీ మాట్లాడుతూ శ్యామ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన తెలిపారు. అయితే శ్యామ్ ఆత్మహత్య వెనుక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) కార్యకర్తల ప్రమేయం ఉందని తెలుగుదేశం పార్టీ (TDP) ఆరోపించడంతో శ్యామ్ మరణం రాజకీయ రంగు పులుముకుంది.
నిప్పులు చెరిగిన చంద్రబాబు..
శ్యామ్కు న్యాయం చేయాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళవారం ఉదయం తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు.. “తూర్పు గోదావరి జిల్లా చింతలూరులో శ్యామ్ యొక్క అకాల మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. శ్యామ్ మృతికి సంబంధించిన అనుమానాస్పద పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి న్యాయం జరిగేలా చూడాలని నేను గట్టిగా కోరుతున్నాను. ఇందులో వైఎస్సార్సీపీ సభ్యుల ప్రమేయం ఉందని, వారి ప్రమేయంపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలి అని అయన డిమాండ్ చేసారు”.
Deeply saddened by the tragic and untimely demise of Shyam in Chintaluru, EG District. The suspicious circumstances surrounding his death are alarming. I strongly urge for a thorough investigation into this matter, ensuring justice is served. It has been alleged that YSRCP… pic.twitter.com/55bpR9cgvR
— N Chandrababu Naidu (@ncbn) June 27, 2023
శ్యామ్ సూసైడ్ వీడియో పోస్ట్ చేసిన భార్గవ్..
ఇది ఇలా ఉండగా వైస్సార్సీపీ సోషల్ మీడియా ఇంచార్జి సజ్జల భార్గవ తన ట్విట్టర్ ఖాతా లో చంద్రబాబు విమర్శలను తిప్పికొడుతూ శ్యామ్ చనిపోవడానికి ముందు తాను తీసిన సెల్ఫీ వీడియో ని పోస్ట్ చేసారు. ఇది ఇలా ఉండగా వైస్సార్సీపీ సోషల్ మీడియా ఇంచార్జి సజ్జల భార్గవ తన ట్విట్టర్ ఖాతా లో చంద్రబాబు విమర్శలను తిప్పికొడుతూ శ్యామ్ చనిపోవడానికి ముందు తాను తీసిన సెల్ఫీ వీడియో ని పోస్ట్ చేసారు. శ్యామ్ చనిపోవడానికి ప్రేమ వ్యవహారం మరియు తన చదువులో వెనుక పడటమే కారణమని ఈ వీడియో ద్వారా తెలుస్తుంది. శ్యామ్ మరణం ఆత్మహత్యేనని ఇప్పటికే పోస్ట్ మోర్టమ్ రిపోర్ట్ తెలిపింది.
శ్యాం సూసైడ్ చేసుకునే ముందు తన ఫోన్ లో రికార్డ్ చేసిన వీడియోలు
దీనికి రాజకీయ రంగు పులిమి నీచ రాజకీయాలు చేస్తోంది టిడిపి. 40 ఏళ్ల ఇండస్ట్రీ ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో.. నీచ రాజకీయాలు మానుకో..@JaiTDP @ncbn @naralokesh #RIPShyamNTR #TDPFakePropaganda pic.twitter.com/usjiBqaw7g
— Sajjala Bhargava Reddy (@SajjalaBhargava) June 27, 2023
ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో.. నీచ రాజకీయాలు మానుకో..
శ్యామ్ మరణం ఆత్మహత్యేనని తెలిసిన దానిని వైస్సార్సీపీ కి మరియు సీఎం జగన్ కు ఆపాదించడం పైన వైస్సార్సీపీ సోషల్ మీడియా ఇంచార్జి సజ్జల భార్గవ్ టీడీపీ అధినేత చంద్రబాబు పై ఫైర్ అయ్యారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అయిన చంద్రబాబు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని.. శవాల మీద తన నీచ రాజకీయాన్ని ఆపాలని భార్గవ్ చంద్రబాబు కి సూచించారు. ఇది ఇలా ఉండగా చనిపోయిన శ్యామ్ ఎన్టీఆర్ వీరాభిమాని కావడం తో ఎన్టీఆర్ ఫాన్స్ శ్యామ్ కు ట్విట్టర్ ద్వారా నివాళులు అర్పించారు. శ్యామ్ ఎన్టీఆర్ ని కలిసినప్పటి వీడియో ని షేర్ చేస్తూ సహాయం ఆత్మ కి శాంతి చేకూరాలని ప్రార్ధించారు.
We Miss You Shyam 💔🥺#WeWantJusticeForShyamNTR pic.twitter.com/vDmJPAjgwI
— Nadiri Ravi 9999 (@NadiriRRRavi) June 27, 2023
Follow Us On : YouTube , Google News