గత కొద్ది రోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan) తన వారాహి యాత్ర లో భాగంగా ఉభయ గోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో వైస్సార్సీపీ కి చెందిన ఎమ్మెల్యేల పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అయితే జనసేనాని జ్వరం కారణంగా తన పర్యటనను ముగించి హైదరాబాద్ వెళ్లిపోయారు. అయితే హైదరాబాద్ వెళ్లిన పవన్ సినిమా కార్యక్రమాలలో పాల్గొనడం పైన వైస్సార్సీపీ సోషల్ మీడియా విభాగం ఇంచార్జి సజ్జల భార్గవ్ ట్రోల్ చేసారు.
సినిమా డబ్బింగ్ కోసమే వారాహి ని ఆపార..!
వారాహి యాత్ర ను తీవ్ర జ్వరం కారణంగా ఆపుతున్నామని చెప్పిన జనసేనాని (Pawan), హైదరాబాద్ లో తన సినిమా సభ్యులతో ఉన్న వీడియో బయటకు రావడంతో వైస్సార్సీపీ సోషల్ మీడియా ఆయనను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. పవన్ హైదరాబాద్ వెళ్ళింది తన సినిమా షూటింగ్ మరియు రేపు నెల విడుదల కాబోయే తన కొత్త సినిమా డబ్బింగ్ పనుల మీద మాత్రమే అని వైస్సార్సీపీ సోషల్ మీడియా ఇంచార్జి సజ్జల భార్గవ్ రెడ్డి విమర్శించారు. దీనికి సంబంధించి భార్గవ్ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతోంది.
జ్వరం అని చెప్పి సినిమాకు డబ్బింగులు చెప్పుకుంటున్నాడు
ఇది ఈ ప్యాకేజ్ స్టార్ కు ఉన్న చిత్తశుద్ధి… #PackageStarPK pic.twitter.com/TfAtlmSUCU
— Sajjala Bhargava Reddy (@SajjalaBhargava) June 28, 2023
Follow Us On : YouTube , Google News