టీడీపీ యువనేత మాజీ మంత్రి నారా లోకేష్ (Lokesh) చేపట్టిన యువగలం పాదయాత్ర నెల్లూరు జిల్లాలో కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే బుధవారం నెల్లూరు లో జరిగిన బహిరంగ సభ లో ఆయన పాల్గొన్నారు. ఈ సభలో నారా లోకేష్ మాటలు తడబడడంతో ప్రత్యర్థులు ఆయనని సోషల్ మీడియా వేదికగా వైస్సార్సీపీ చెందిన ఎమ్మెల్యేలు మంత్రులు ట్రోల్ చేస్తున్నారు.
ఒక్క నిమిషం అంటూ..
బుధవారం సభలో లోకేష్ (Lokesh) రైతుల సమస్యల మీద మాట్లాడుతూ మాటలు తడబడ్డారు. “ఏకంగా రైతుల గాయాల పైన కారం చల్లుతున్నారు” అనే వ్యాక్యాన్ని చెప్పబోయారు. ఆ వ్యాక్యంలో “రైతుల గాయాలు” అని మూడు సార్లు చెప్తూ తర్వాత చెప్పాల్సిన “కారం చల్లుతున్నారు” అనే వ్యాక్యాన్ని మర్చిపోయారు.. “ఒక్క నిమిషం” అని చెప్పి చేతిలో ఉన్న పేపర్ ని చూసి తాను చెప్పాలనుకున్న వ్యాఖ్యని చెప్పారు.
చినబాబు స్క్రిప్ట్ మర్చిపోయాడు..
దీనినే అస్త్రంగా మార్చుకున్న వైస్సార్సీపీ సోషల్ మీడియా ఒక్కసారిగా యాక్టీవ్(Active) అయ్యి లోకేష్ మీద ముప్పేట దాడి ని కొనసాగించాయి. వైస్సార్సీపీ అధికారిక సోషల్ మీడియా హేండిల్ అయితే “చినబాబు స్క్రిప్ట్ మర్చిపోయారని. లోకేష్ ని నమ్ముకుంటే పరిస్థితి దిగజారిపోతోంది అని దత్తపుత్రుడు (Pawan Kalyan) ని చంద్ర బాబు రంగంలోకి దింపాడని ఎద్దేవా చేసింది.” దీని పై నీటి పారుదుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అయితే “యువగలం అంటే ఇదే” అని లోకేష్ ని ఉద్దేశించి ట్వీట్ చేసారు.
పావం 😂 సినబాబు కి స్క్రిప్టు గుర్తుకు రావట్లేదు అనుకుంటా…!
నిన్ను నమ్ముకుంటే పరిస్థితి చేజారేలా ఉందని దత్తపుత్రుడిని రంగంలోకి దింపినట్టున్నాడు @Naralokesh, మీ బాబు గారు.#EndOfTDP pic.twitter.com/REZHL6Igo9
— YSR Congress Party (@YSRCParty) June 28, 2023
Follow Us On : YouTube , Google News