ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్ జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు కౌంటర్ ట్వీట్ చేసారు. అమ్మఒడి పధకం పై సీఎం జగన్ చేసిన ట్వీట్ పై చంద్రబాబు స్పందించారు. ఎన్నికలకు ముందు మాయ మాటలు చెప్పిన జగన్ అధికారం లోకి రాగానే మాట మార్చారంటూ ఫైర్ అయ్యారు. జగన్ వి అన్ని కోతలేనన్న చంద్రబాబు పచ్చి అబద్దాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని చంద్రబాబు ట్వీట్ చేసారు.
ఆంక్షల పేరుతో…
అమ్మఒడి పథకానికి 83 లక్షల మంది లబ్ధిదారులుండగా ఆంక్షల పేరుతో వేల సంఖ్యలో తొలిగించారంటూ మండిపడ్డారు. ఒక కుటంబంలో ఇద్దరు విద్యార్థులున్నా ఒక్కరికే అమ్మఒడి పధకాన్ని పరిమితం చేసారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఒక్కొక్క లబ్ధిదారుకి పదిహేను వేలు ఇస్తామని చెప్పిన జగన్ తర్వాత కొర్రీలు పెడుతూ ఎగనామం పెడుతున్నారంటూ టీడీపీ చీఫ్ చంద్రబాబు విమర్శించారు.
తల్లికి వందనం
విద్యుత్ వాడకం ఎక్కువగా ఉంటే పథకాన్ని ఇవ్వడం లేదన్నారు. అలాగే స్కూల్ లో 75 శాతం హాజరు తక్కువ అయితే తొలగిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇలా ఎన్నికల సమయంలో ప్రజలను తప్పుదోవ పట్టించి అధికారం లోకి వచ్చిన తర్వాత మాట మార్చడం ఏమిటని చంద్రబాబు ప్రశ్నించారు. విద్యతోనే బతుకు మారుతుందని బలంగా నమ్మే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తల్లికి వందనం పేరుతో ఇంట్లో చదువుకునే పిల్లలందరికీ రూ.15 వేల చొప్పున ఇస్తామని చంద్రబాబు ట్వీట్ చేసారు.
Follow Us On : YouTube , Google News