మాజీ ఇండియన్ క్రికెటర్ అంబటి రాయుడు పాలిటిక్స్ లోకి వస్తున్నారు. అయన గత కొద్ది రోజుల నుంచి గుంటూరు పార్లమెంట్ నిజయోజకవర్గ పరిధిలో పర్యటన చేషున్నారు. అంబటి రాయుడి సొంత జిల్లా గుంటూరు కావడం తో అయన అక్కడి నుంచే పోటీ చేస్తారన్న ప్రచారం కొన్నాళ్లుగా ఉంది. అయితే పార్లమెంట్ కు పోటీ చేస్తారా? లేక అసెంబ్లీకి పోటీ చేస్తారా? అన్న దానిపై క్లారిటీ మాత్రం లేదు.
ప్రజాసేవకు…
అంబటి రాయుడు క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లకు బై చెప్పేసారు. 2023 ఐపీల్ ఆయనకు చివరి మ్యాచ్. ఇక అంబటి ప్రజాసేవలోకి వస్తారన్న సంకేతాలు కొన్ని రోజుల నుంచి వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ సీఎం జగన్ ను కలవడంతో ఆయన వైసీపీ లో చేరతారని కూడా దాదాపు ఖరారయింది. వైసీపీ లో చేరి వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగి ప్రజాసేవ చేయాలన్న ఉద్దేశ్యంతో అంబటి రాయుడు ఉన్నారు.
జగన్ క్లియరెన్స్…
ఈ మేరకు వైసీపీ అధినేత జగన్ నుంచి కూడా క్లియరెన్స్ వచ్చిందన్నది పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఇప్పటి వరకు క్రికెట్ మైదానంలో దుమ్ము రేపిన రాయుడు ప్రజాక్షేత్రం లోనూ ఒక ఆటాడుకుంటాడని రాయుడు సన్నిహితులు చెపుతున్నారు. అంబటి రాయుడు కాపు సామాజికవర్గానికి చెందిన నేత కావడం తో ఆయనకు వైసీపీ లో ప్రయారిటీ బాగా ఉంటుందన్న అంచనాలు వినిల్పించాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పోటీగా రాయుడు సేవలను కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉపయోగించుకోవాలన్న ఆలోచనలో వైసీపీ అధినాయకత్వం ఉంది.
విస్తృత పర్యటన….
అంబటి రాయుడును గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీ చెంయించాలన్న ఉద్దేశ్యంతో జగన్ ఉన్నట్లు తెలిసింది. గుంటూరు పార్లమెంట్ అయితే అంబటి గెలుపు నల్లేరు మీద నడక అవుతుందని జగన్ భావిస్తున్నారని పార్టీ వర్గాలు ఆఫ్ ది రికార్డు గా చెబుతున్నాయి. అంబటి కూడా పార్లమెంట్ కు పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారని అయన సన్నిహితులు అంటున్నారు. క్రికెటర్ గా ప్రపంచమంతా పరిచయమైనా రాయుడిని అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉంచడం సరికాదన్న అభిప్రయం పార్టీ లో వ్యక్తం అవుతుంది. అందుకే అంబటి గత కొద్దీ రోజుల నుంచి గుంటూరు పార్లమెంట్ పరిధిలో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా యువత అంబటి పట్ల ఆకర్షితులవుతారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అంబటి రాయుడు తన పోటికల్ ఎంట్రీ పై ఎలాంటి ప్రకటన చేయకపోయినప్పటికీ ఆయన వైసీపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి గానే జనం చూస్తున్నారు. దీనిపై అంబటి అధికారకంగా ప్రకటించాల్సి ఉంది.