హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానముంది. ఒక ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని ”తొలి ఏకాదశిగా” గా పిలుస్తారు. దీనికే ”శయనైకాదశి” అని ”హరి వాసరమని” , ”పేలాల పండుగ” అని పేరు. హిందువుల తొలి పండుగగా ఖ్యాతికెక్కిన తొలి ఏకాదశి పర్వదినానికి హైందవ సంస్కృతిలో విశేష స్థానముంది.ఈ రోజు తొలి ఏకాదశి. ఈ సంవత్సరం 29 జూన్ న (29.06.2023) పండుగ జరుపుకుంటున్నారు. తెలుగు మాసాలలో ఆషాఢానికి ప్రత్యేక స్థానం ఉంది. చంద్రుని గమనాన్ని బట్టి నెలల పేర్లను నిర్ణయించారు.
పూర్వాషాడ, ఉత్తరాషాడ నక్షత్రాల దగ్గర చంద్రుడు ప్రవేశించినప్పుడు ఈ మాసాన్ని ఆషాడం అంటారు. తెలుగు నెలల్లో ఇది నాల్గవ నెల.ఆషాఢంలో సూర్యుడు ఉత్తరాయణం నుండి దక్షిణాయణంలోకి ప్రవేశిస్తాడు. అలాగే ఈ నెలలోనే వర్షాకాలం ప్రారంభమవుతుంది. హిందువులు మంచి పనులు చేయడానికి దశమి మరియు ఏకాదశి తిథిలను పాటిస్తారు. ఏడాది పొడవునా వచ్చే 24 ఏకాదశిలలో వర్షాకాలంలో వచ్చే తొలి ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఆషాడ శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా అంటారు.ఆషాఢంలో సూర్యుడు ఉత్తరాయణం నుండి దక్షిణాయణంలోకి ప్రవేశిస్తాడు. అలాగే ఈ నెలలోనే వర్షాకాలం ప్రారంభమవుతుంది.
శయన ఏకాదశి
హిందువులు మంచి పనులు చేయడానికి దశమి మరియు ఏకాదశి తిథిలను పాటిస్తారు. ఏడాది పొడవునా వచ్చే 24 ఏకాదశిలలో వర్షాకాలంలో వచ్చే తొలి ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఆషాడ శుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా అంటారు.సాధారణంగా ఆషాఢాన్ని శూన్యంగా పరిగణిస్తారు. ఎలాంటి శుభ కార్యాలు, వేడుకలు నిర్వహించరు. అయితే, ఆషాడం పూజలకు మరియు ఆచారాలకు ఉత్తమమైనదిగా నమ్ముతారు. దేవతలను, ఈశ్వరుని, విష్ణువును పూజించాలని అంటారు. సతీ సక్కుబాయి ఈ రోజున మోక్షాన్ని పొందింది. తొలి ఏకాదశి రోజు రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసి మరుసటి రోజు విష్ణుమూర్తిని పూజించి మరుసటి రోజు తీర్థప్రసాదాలు స్వీకరిస్తే మోక్షప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ ఉపవాసం మానసిక మరియు శారీరక అవగాహనకు చిహ్నం.
ఏకాదశి అంటే పదకొండు. ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు మరియు మనస్సు కలిసి పదకొండు చేస్తుంది. ఈ ఏకాదశ ఉపవాస దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశ్యం మానవుడు వీటన్నింటిని స్వాధీనం చేసుకొని భగవంతుని పూజించడమే. పురాణాల ప్రకారం శ్రీమహావిష్ణువు క్షీర సముద్రంలో నాలుగు నెలల పాటు నిద్రించి మళ్లీ ప్రభోది ఏకాదశి రోజున మేల్కొంటాడు. మహావిష్ణువు ఈ నాలుగు నెలలు పాతాళంలో బలి రాజుతో ఉంటాడని మరియు కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని నమ్ముతారు. ఈ నాలుగు మాసాలలో కొందరు చాతుర్మాస దీక్షలు చేస్తారు. ప్రస్తుతం మఠాధిపతులు, సన్యాసం స్వీకరించిన వారు చ తుర్మాస దీక్షను ఆచరిస్తున్నారు.
గోపద్మ వ్రతం
ఈ గోమాత పూర్తిగా విరాట్ పురుషుని రూపంతో పోల్చబడింది. గోవునకు ముఖము నందు వేదాలు, కొమ్మల యందు హరిహరులు, కొమ్ముల చివర ఇంద్రుడు, లలాటమున ఈశ్వరుడు, కర్ణములందు అశ్వనీదేవతలు నేత్రములందు సూర్యచంద్రులు, దంతములయందు గరుడుడు, జిహ్వయందు సరస్వతి, ఉదరమునందు స్కందుడు, రోమకూపములందు ఋషులు, పూర్వభాగమునందు యముడు, పశ్చిమ భాగమునందు అగ్ని, దక్షిణభాగమున వరుణ కుబేరులు, వామభాగము నందు యక్షులు, ముఖమునందు గంధర్వులు, నాసాగ్రమందు పన్నగలు, అపానంబున సరస్వతి, గంగాతీర్థంబులు, గోమయంబున లక్ష్మీ, పాదాగ్రంబున ఖేచరులును, అంబా అంటూ అరచే అరుపులో ప్రజాపతి, స్థనములందు చతుస్సాగరములు ఉన్నట్లుగా వర్ణింపబడెను.
కావున గోవును పూజిస్తే! సమస్త దేవతలను పూజించి నట్లేనని, సమస్త తీర్థములలో పుణ్యస్నానం చేసిన పుణ్యఫలం లభిస్తుందని ‘గోమాతకు’ ఇంత పూజ్యస్తానమిస్తూ, అధర్వణ వేదంలో బ్రహ్మాండ పురాణంలో, మాహాభారతంలో, పద్మపురాణంలో ఇలా ఎన్నో గాధలు ఉన్నాయి.అట్టి గోమాత నివశించే గోశాలను ఈ ‘తొలిఏకాదశి’ దినమందు మరింతగా శుభ్రముచేసి అలికి ముత్యాల ముగ్గులతో రంగవల్లికలను తీర్చిదిద్ది గోశాల మధ్యభాగ మందు బియ్యపు పిండితో ముప్పైమూడు పద్మాల ముగ్గులు పెట్టి, శ్రీమహాలక్ష్మీ సమేత శ్రీమహావిష్ణువు ప్రతిమను ఆపద్మములపైనుంచి, వారిని విధివిధానంగా పూజించి, పద్మానికి ఒక్కొక్క “అప్పడాన్ని” వాటిపై ఉంచి ఆ అప్పడాలను వాయనాలను, దక్షిణ తాంబూలాదులలో బ్రాహ్మణుని సంతుష్టుని గావించి, గోమాతను పూజించువార్కి సకలలాభీష్టములు తప్పక నెరవేరుతాయని చెప్పబడినది. అలా గోపద్మవ్రతం చెయ్యాలి.
తొలి ఏకాదశి
ఆషాఢమాస శుక్ల పక్షంలో వచ్చే తొలి ఏకాదశి రోజున ఒంటి పూట భోంచేసి, శేషశాయి అయిన లక్ష్మీనారాయణ మూర్తిని స్తుతిస్తే కోటి పుణ్యాల ఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఆషాఢమాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్బాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది.తొలి ఏకాదశి రోజున మరమరాలు లేదా పేలాల పిండి తినడం ఆచారం. మరమరాలు అంటే పితృదేవతలకు ఇష్టమైనవి.
మనకు జన్మనిచ్చిన వారిని స్మరించుకోవడం మన బాధ్యత. వేసవి కాలం ముగిసిన తర్వాత, రుతుపవనాలు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి వేడిని తెస్తాయి. కాబట్టి ప్రజలు ఆ రోజు దేవాలయాలు మరియు ఇళ్లలో మరమరాల పిండిని ప్రసాదంగా స్వీకరిస్తారు.ఆషాడ మాసంలో మన శరీరం మందకొడిగా మారి అనేక రోగాలు వస్తాయి. అందుకే ఈ తొలి ఏకాదశి రోజున ఉపవాసం చేయడం వల్ల జీర్ణాశయం శుభ్రపడుతుందని, శరీరానికి ఉత్తేజం లభిస్తుందని విశ్వసిస్తారు. కాబట్టి ఆచారం వెనుక ఆరోగ్య సూత్రం దాగి ఉందన్న నమ్మకంతో ప్రజలు ఉపవాసం ఉంటారు.
Follow Us On : YouTube , Google News