ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అచ్యుతాపురం సెజ్లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. ప్రమాదానికి కారణం తెలియనప్పటికీ పెద్దయెత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. అచ్యుతాపురం సెజ్లో ఉన్న ఒక ఫార్మా కంపెనీలో ఈ ప్రమాదం జరిగింది. భారీ శబ్దాలు రావడంతో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులతో పాటు స్థానికులు కూడా పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో అనేక మంది గాయాలపాలయ్యారు.
రెండు ఫైర్ ఇంజిన్లు…
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సాహితి ఫార్మాలో రెండు రియాక్టర్లు పేలినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మొదటి షిఫ్ట్లో దాదాపు వంద మంది కార్మికులు పనిచేస్తున్నారని చెబుతున్నారు. అయితే ఫ్యాక్టరీలోపల ఎంతమంది ఉన్నారన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు.
గాయపడిన వారు..
రెండు ఫైర్ ఇంజిన్లు సంఘటన స్థలికి చేరుకున్నాయి. భారీగా మంటలు ఎగిసి పడుతుండటంతో వాటిని అదుపు చేయడం కూడా కష్టంగా మారింది. గాయపడిన కార్మికులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కార్మికుల్లో ఎక్కువ మంది తీవ్రంగా గాయపడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. రెస్క్యూ ఆపరేషన్ను వేగవంతం చేయాలని మంత్రి అమర్నాధ్ ఆదేశించారు.
Follow Us On : YouTube , Google News