మహారాష్ట్రలో పెను విషాదం చోటు చేసుకుంది. బస్సు ప్రమాదంలో ఇరవై మంది మరణించారు. బస్సు అగ్నికి ఆహుతికి గురి కావడంతో పెద్దయెత్తున ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలోని బుల్దానాలోని సమృద్ధి మహామార్గ్ ఎక్స్ప్రెస్ హైవేపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇరవై అయిదు మంది చనిపోగా మరికొందరు గాయాలపాలయ్యారు.
రాత్రి రెండు గంటల సమయంలో…
ఈ ప్రయివేటు ట్రావెల్స్ బస్సు యావత్కాల్ నుంచి పూనేకు వెళుతుంది. ఈ ప్రమాదం రాత్రి రెండు గంటల సమయంలో జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 32 మంది ప్రయాణికులున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అందరూ నిద్రలో ఉండగా ప్రమాదం జరగడంతో ఎవరూ బయటపడలేకపోయారు. అయితే బస్సు డ్రైవర్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు.
మరికొందరి పరిస్థితి…
గాయపడిన వారిని బుల్దానా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. బస్సు టైర్ పేలి ఒక డివైడర్ను ఢీకొట్టడంతోనే మంటలు చెలరేగాయని డ్రైవర్ చెబుతున్నారు. ప్రయాణికుల జాబితా ప్రకారం మృతులను గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మరణించిన వారిలో కొన్ని మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి. పోలీసులు ఈ ప్రమాదంపై దర్యాప్తు జరుపుతున్నారు.