న్యూఢిల్లీ : మే నెలలో వసూలైన వసూలైన స్థూల జీఎస్టీ(Gross GST) రూ.1,57,090 కోట్లు ,జూన్ నేల లో వసూలైన (Gross GST) ఆదాయం తో పోలిస్తే 2.80 శాతం పెరిగింది అంటే రూ.1,57,090 కోట్లు నుంచి రూ.1,61,497 కోట్లకు చేరుకుంది.
జూన్లో వసూలైన జీఎస్టీలో (GST) సీజీఎస్టీ (CGST) భాగం రూ.31,013 కోట్లు, ఎస్జీఎస్టీ(SGST)భాగం రూ.38,292 కోట్లు, ఐజీఎస్టీ (IGST)భాగం రూ.80,292 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన రూ. 39,035 కోట్లతో కలిపి), సెస్ (Cess) రూ.11,900 కోట్లు (దిగుమతిపై రూ. 1,028 కోట్లతో కలిపి వసూలు చేశారు).
ప్రభుత్వం ఐజీఎస్టీ(IGST) నుంచి సీజీఎస్టీకి (CGST) రూ.36,224 కోట్లును సెటిల్ చేసింది. అలాగే ఎస్జీఎస్టీకి (SGST) రూ.30,269 కోట్లు కుడా సెటిల్ చేసింది.రెగ్యులర్ సెటిల్మెంట్ తర్వాత జూన్లో కేంద్రం తో పాటు అన్ని రాష్ట్రాల మొత్తం CGST ఆదాయం రూ.67,237 కోట్లు మరియు SGST రూ.68,561 కోట్లు.
గత ఏడాది ఇదే నెలలో వచ్చిన జీఎస్టీ ఆదాయాల కంటే జూన్లో వచ్చిన ఆదాయాలు 12 శాతం ఎక్కువ.జూన్లో, దేశీయ లావాదేవీల ద్వారా వచ్చే ఆదాయాలు (సేవల దిగుమతితో సహా) గత ఏడాది ఇదే నెలలో ఈ వనరుల నుండి వచ్చిన ఆదాయాల కంటే 18 శాతం ఎక్కువ.స్థూల జీఎస్టీ(Gross GST) వసూళ్లు రూ.1.60 లక్షల కోట్ల మార్కును దాటడం ఇది నాలుగోసారి.
Follow Us On : YouTube , Google News