న్యూఢిల్లీ : సోమవారం తెల్లవారుజామున ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్లోని ప్రధాని నివాసం సమీపంలో డ్రోన్ కనిపించింది .ప్రధాని నివాసం పైన డ్రోన్ ఎగురుతున్నట్లు గుర్తించామని ఓ అధికారి తెలిపారు.ప్రధానమంత్రి నివాసం వద్ద ఉన్న ఒక SPG తెల్లవారుజామున సుమారు 5 గంటల ప్రాంతంలో నో ఫ్లయింగ్ జోన్లో డ్రోన్ను చూసి పోలీసులకు సమాచారం అందించారు.
ప్రధానమంత్రి నివాసానికి సమీపంలో గుర్తుతెలియని ఓ వస్తువు ఆకాశం లో ఎగురుతూ కనిపించిందని దానితో వారు న్యూఢిల్లీ జిల్లా కంట్రోల్ రూమ్కు సమాచారం అందించారని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.ఈ సమాచారం ఆధారం గా “సమీప ప్రాంతాల్లో క్షుణ్ణంగా సోదాలు చేసారు , కానీ అలాంటి ఏ వస్తువు కనుగొనబడలేదు” అని అధికారి తెలిపారు.
విచారణ లో భాగం గా , ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ (ATC)ని కూడా సంప్రదించారు, వారు కూడా ప్రధాని నివాసానికి సమీపంలో అలాంటి ఏ ఎగిరే వస్తువును గుర్తించలేదని అధికారి తెలిపారు.దీనీ పై మరిన్ని వివరాలు పూర్తి దర్యాప్తు అంతరం తెలిజేస్తం అని అధికారులు తెలిపారు.
Follow Us On : YouTube , Google News