న్యూఢిల్లీ: ఆఫ్రికాకు చెందిన 28 ఏళ్ల వ్యక్తి దాదాపు 13 ఏళ్లుగా స్కిజోఫ్రెనియాతో బాధపడుతునాడు ఆఫ్రికాకు చెందిన ఈ వ్యక్తి భారతదేశంలో స్కిజోఫ్రెనియాకు శస్త్రచికిత్స చేయించుకున్న మొదటి వ్యక్తిగా నిలిచాడు.గురుగ్రామ్లోని మారెంగో ఆసియా హాస్పిటల్స్కు చెందిన వైద్యులు ఒక ప్రకటనలో మాట్లాడుతూ, “స్కిజోఫ్రెనియా, బలహీనపరిచే ఒక మానసిక వ్యాధి అని ఆ వ్యాధి కి ఇదే భారతదేశంలో చేసిన మొదటి శస్త్రచికిత్స అన్నారు.
15 సంవత్సరాల వయస్సుల నుండి స్కిజోఫ్రెనియాతో బాధపడుతున్న బాధితుడి కి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ (DBS) శస్త్రచికిత్స ద్వారా విజయవంతంగా చికిత్స అందించబడిందని , ఇందులో మెదడులోని నిర్దిష్ట ప్రాంతాల్లోకి ఎలక్ట్రోడ్లను అమర్చడం జరుగుతుందన్నారుఈ ఎలక్ట్రోడ్లు అసాధారణ మెదడు కార్యకలాపాలను నియంత్రించడానికి మరియు సమతుల్యతను పునరుద్ధరించడానికి విద్యుత్ ప్రేరణలను అందిస్థాయ్యనారు .
“ప్రపంచవ్యాప్తంగా 13 సార్లు మాత్రమే నిర్వహించబడిన గ్రౌండ్ బ్రేకింగ్ ప్రక్రియ, మనోవిక్షేప శస్త్రచికిత్స (సైకో సర్జరీ) రంగంలో అద్భుతమైన పురోగతిని సూచిస్తుంది” అని చెప్పారు .బాధితుడు జూన్ 14 న ఆపరేషన్ చేయించుకున్నాడు మరియు అప్పటి నుండి “గణనీయమైన” రోగలక్షణ తగ్గింపు మరియు అతని పరిస్థితిలో మొత్తం మెరుగుదలతో ఆశాజనకమైన ఫలితాలను చూపించాడు” అని వైధ్యులు తెలిపారు.
“మొత్తం ప్రక్రియ 8-10 గంటలు సమయం పట్టిందని మరియు బాధితుడి ని రాత్రిపూట ICUలో పర్యవేక్షించామన్నారు వైధ్యులు . ఆపరేషన్ తర్వాత 2వ రోజున, అతను నడవగలిగాడని అంతే కాకుండా అతని లక్షణాలలో 50-60 శాతం మెరుగుదల కనిపించిందన్నారు.10వ రోజు అతను తన భయాలు ,భ్రమలు ఆందోళనల లో 80 శాతం తగ్గినట్లు గమనించాం” అని హాస్పిటల్లోని సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ డాక్టర్ హిమాన్షు చంపనేరి తెలిపారు.
“స్కిజోఫ్రెనియాలో ఎంచుకున్న లక్ష్యాన్ని న్యూక్లియస్ అక్యుంబెన్స్ అని పిలుస్తారని , ఇది బాధితుడి యొక్క భ్రాంతులు మరియు భ్రమలు వంటి లక్షణాలకు బాధ్యత వహిస్తుంది” అని ఆయన చెప్పారు.వివిధ మందుల ఉప్పయోగించినప్పటికీ,బాధితుడు స్కిజోఫ్రెనియా యొక్క ఇతర లక్షణాలతో పాటు నిరంతర భ్రాంతులు మరియు భ్రమలను ఎదుర్కొంటున్నాడని.అతను సుమారు ఎనిమిది సంవత్సరాలు తన గదిలో ఒంటరిగా ఉన్నాడని,అతను పాఠశాల నుండి తప్పుకున్నప్పటి నుండి అతని జీవన నాణ్యత, అతని సామాజిక జీవితం మరియు అతని విద్యా వృద్ధిని తీవ్రంగా ప్రభావితం చేశాయన్నారు .
బాధితుడు కి స్కిజోఫ్రెనియా లక్షణాలు సంవత్సరాలుగా క్రమక్రమంగా మరింత తీవ్రమయ్యాయని , ఇది పూర్తిగా సామాజిక ఉపసంహరణలో వ్యక్తమవుతుంది. అతను సూచించిన మందులకు ఎక్కువ నిరోధకతను పెంచుకున్నాడన్నారు వైధ్యులుఈ పరిస్థితి రోజువారీ జీవితంలో బాధితుని యొక్క పనితీరును గణనీయంగా ప్రభావితం చేయడం ప్రారంభించిందన్నారు .బాధితుని తండ్రి అతనిని న్యూరోమోడ్యులేషన్ అనే మెరుగైన చికిత్స కోసం భారతదేశానికి తీసుకువచ్చినప్పుడు అతను సూచించిన మందులకు ఎక్కువ నిరోధకతను కలిగి ఉన్నాడని , వైద్యులు చెప్పారు.అన్ని చికిత్సా ప్రత్యామ్నాయాలను పరిశీలించిన తర్వాత, బాధితుడి కి DBS శస్త్రచికిత్స అవసరం అని నిర్ధారించుకున్నామన్నారు .
భారతదేశ మానసిక ఆరోగ్య చట్టం 2017 ప్రకారం, మానసిక శస్త్రచికిత్స చేయడానికి తమ ఆసుపత్రి ప్రభుత్వ మానసిక ఆరోగ్య సమీక్ష బోర్డు నుండి అనుమతి తీసుకుందన్నారు”DBS అసాధారణ మెదడు నెట్వర్క్లను మాడ్యులేట్ చేయడం ద్వారా పనిచేస్తుంది కాబట్టి బాధితులలో సమయం గడిచేకొద్దీ మరింత మెరుగుపడతారని భావిస్తున్నామన్నారు . DBS ప్రధానంగా పార్కిన్సన్స్ వ్యాధి వంటి మూవ్మెంట్ డిజార్డర్స్లో దాని అప్లికేషన్కు ప్రసిద్ధి చెందింది, స్కిజోఫ్రెనియాతో సహా మానసిక రుగ్మతలకు చికిత్స చేయడంలో దాని సామర్థ్యం ఆశాజనకంగా కనిపిస్తుంది” అని డాక్టర్ చంపనేరి చెప్పారు.
Follow Us On : YouTube , Google News