స్టాక్ మార్కెట్ దూసుకెళుతుంది. గత వారం తరహాలోనే ఈ వారం కూడా దలాల్ స్ట్రీట్ ధగధగలాడుతుంది. ఎక్కువ మంది కొనుగోళ్లు చేయడంతో ఈరోజు భారీ లాభాలతో సూచీలు మొదలయ్యాయి. దీంతో ఇన్వెస్టర్లు ఆనందపడిపోతున్నారు. సెన్సెక్స్ అరవై ఐదు వేల మైలురాయిని దాటడంతో పాటు నిష్టీ కూడా 19,200 పైగానే ఉండటంతో హ్యాపీగా ఉన్నారు.
సెన్సెక్స్ ఎగబాకి…
ఈ రోజు ఉదయం నుంచి సెన్సెక్స్ 341 పాయింట్లు ఎగబాగి 65,059 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ 103 పాయింట్ల లాభంతో 19,292 వద్ద ట్రేడ్ అవుతుంది. డాలర్తో రూపాయి మారకం విలువ కూడా పంధొమ్మిది పైసలు బలపడింది. ప్రస్తుతం రూపాయి మారకం విలువ 81.91 రూపాయలుగా కొనసాగుతుంది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్లో జేఎస్డబ్ల్యూ స్టీల్, మహేంద్ర అండ్ మహేంద్ర, అల్ట్రా టెక్ సిమెంట్, హెచ్డీఎఫ్సీ, ఐషర్ మోటార్ షేర్లు పెరిగాయి.
ఈ కారణంతోనే…
పవర్ గ్రిడ్ కార్పొరేషన్, మారుతి సుజుకీ, బజాజ్ ఆటో, హోరో మోటర్స్, ఏషియన్ పెయింట్స్ వంటివి మాత్రం కొంత ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అన్ని రకాల ఇండెక్స్లు లాభాల బాటలో పయనిస్తున్నాయి. చమురు ధరలు తగ్గడం, విదేశీ కొనుగోళ్లు పెరగడం కారణంగా మార్కెట్ సెంటిమెంట్ బలపడిందని నిపుణులు చెబుతున్నారు.
Follow Us On : YouTube , Google News