హలం పట్టుకున్నా.. కలం పట్టుకున్నా.. నేర్పేవాడు ఉన్నప్పుడే అందులో మెళుకువలు తెలుస్తాయి. ఆ నేర్పించేవాడే గురవు. లౌకిక, అలౌకిక, ఆధ్యాత్మిక.. ఇలా ఏ రంగంలో అయినా మనలను నడిపించడానికి గురువు కావాల్సిందే. సనాతన హైందవ సమాజంలో గురువుకు తల్లిదండ్రుల తర్వాత స్థానం దక్కింది. ‘గురోః ప్రసాదాత్ అన్యత్ర నాస్తి సుఖం మహీతలే’ అని గురువు అనుగ్రహం లేనిదే ఇహలోకంలోనైనా పరలోకంలోనైనా సుఖం పొందడం దుర్లభం అని శాస్త్రం బోధిస్తోంది. గుకారశ్చాంధకారస్తు రుకార్తన్నిరోధకృత్ ‘గు’అంటే చీకటి ‘రు’ అంటే దానిని అడ్డగించువాడు.
గురువంటే?…
ఆషాఢ శుద్ధపౌర్ణమిని ‘గురు పౌర్ణమి’ లేదా ‘వ్యాస పౌర్ణమి’ అని అంటారు. గురు పూర్ణిమ… గురువులను, పెద్దలను పూజించే పండుగే గురు పూర్ణిమ. దీన్నే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున హిందువులు గురు పూర్ణిమ ను జరుపుకుంటారు.
ఇదే రోజు వ్యాస ముహాముని జన్మతిథి కావున మహాపర్వదినంగా అనాది కాలం నుంచీ భావిస్తున్నారు. ఈ రోజున గురుభగవానుడిని, వ్యాస మహర్షి, సాయిబాబాను పూజించేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. గురు పూర్ణిమ రోజు చాలా మంది ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుడు ఉదయించిన తర్వాత ఆహారం తీసుకుంటారు. ఇది గురు పూర్ణిమ విశిష్టత. ఈ రోజున గురుభగవానుడిని, వ్యాస మహర్షి, సాయిబాబాను పూజించేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని భక్తుల నమ్మకం.
దత్తాత్రేయ పూజ శ్రేష్టం?
గురు పౌర్ణమి దేశవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందిన పండుగనే చెప్పాలి తెలుగు రాష్ట్రాల్లో అయితే తొలి ఏకాదశి తర్వాత వచ్చే పండగల్లో గురు పౌర్ణమి ఎంతో విశిష్టత కలిగిన చెబుతుంటారు. వేద పండితులు.ఈ పండగ ముఖ్యంగా సాయిబాబా ఆలయాల్లో దత్తాత్రేయ స్వామివారికి శ్రీపాదశ్రీ వల్లభుడు , దత్త అవతారాల్లో అవతార దేవాలయాలు ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో కూడా గురు పౌర్ణమి నాడు ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహిస్తారు.
ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి కడియం ధవలేశ్వరం వంటి ప్రాంతాలతో పాటు ప్రస్తుతం కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి పిఠాపురం పట్టణంలోని శ్రీపాద శ్రీ వల్లభుని క్షేత్రంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి హోమాలు కూడా చేస్తారు. ముఖ్యంగా ఈ రోజున అంటే గురు పౌర్ణమి నాడు సాయిబాబాకు గాని శ్రీపాద వల్లభుడికి గాని లేదా దత్తాత్రేయ అవతారాల్లో ఉన్నటువంటి దేవుళ్లకు పాలాభిషేకం కచ్చితంగా చేయాలంట.
వేద వ్యాస జననం?
మన హిందూ సాంప్రదాయాల ప్రకారం భగవంతుడు తరువాత కనిపించే తల్లిదండ్రులను, గురువారం దైవ సమానంగా భావిస్తాము కనుక తల్లిదండ్రుల తర్వాత అంతటి గొప్ప స్థానం దక్కిందని చెప్పవచ్చు.ఎంతో పవిత్రమైన ఈ గురుపౌర్ణమిని ఎందుకు జరుపుకుంటారు.
గురు పౌర్ణమి జరుపుకోవడానికి గల కారణం ఏమిటి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.పురాణాల నుంచి నేటి వరకు గురువు అంటే అందరికీ వేదవ్యాస మహర్షి గుర్తుకొస్తారు.
ఈ క్రమంలోనే వేద వ్యాస మహర్షి జన్మించిన ఈ పౌర్ణమిని ఆయన జన్మదినానికి గుర్తుగా భావించి గురుపౌర్ణమి గా ప్రజలు పెద్ద ఎత్తున ఒక పండుగలాగా నిర్వహించుకుంటారు.ఈ విధంగా గురు పౌర్ణమి రోజు గురు భగవానుని స్మరించుకుని గురు విగ్రహానికి ప్రత్యేక పూజలు చేయటం వల్ల సకల సంపదలు కలుగుతాయని భక్తులు భావిస్తారు.
ఈ క్రమంలోనే గురు పౌర్ణమి రోజు గురు విగ్రహానికి ప్రత్యేక పూజలు చేస్తారు.
ఈ లోకంలో ప్రతి ఒక్కరికి మొదటి గురువు తల్లి.తల్లి తర్వాత మన లో ఉన్నటువంటి జ్ఞానాన్ని బయటకు తీసేది ఒక గురువు మాత్రమే కనుక గురువుకి అంతటి ప్రాధాన్యత కల్పిస్తారు.మన పురాణాల ప్రకారం వేదాలను నాలుగు భాగాలుగా విభజించి వాటిని సామాన్యుల చెంతకు చేరవేయడంలో వేదవ్యాస మహర్షి ఎంతో కృషి చేశారు.
మహాభారత రచన…
మహాభారతాన్ని మనకు అందించిన జన్మదినం ఆషాడ మాస శుద్ధ పౌర్ణమి రోజు కనుక ఆ రోజును గురుపౌర్ణమిగా జరుపుకుంటారు.ఎంతో పవిత్రమైన ఈ గురు పౌర్ణమి రోజు గురువు అనుగ్రహం పొందాలంటే ప్రత్యేకమైన పూజలు హోమాలు చేయడం దానధర్మాలు చేయడం ద్వారా గురు అనుగ్రహం మనపై ఉంటుంది.
గురు అనే పదంలో ’గు’ అనే అక్షరం అంధకారాన్ని ’రు’ అనే అక్షరం వెలుగును సూచిస్తాయి..
ఙ్ఞానశక్తి సమారూఢః తత్త్వమాలావిభూషితః |
భుక్తిముక్తి ప్రదాతా చ తస్మై శ్రీ గురవే నమః
శిష్యునిలో అజ్ఞానాంధకారాలను తొలగించే బాధ్యతను గురువు తీసుకుంటాడు.. కాబట్టి… గురువుకే ప్రథమ స్థానమునిచ్చారు.. మాతా , పిత , గురువులలో జన్మనిచ్చిన వారి ప్రక్కన గురువుకి అత్యంత విశిష్టమైన స్థానాన్ని కల్పించినది ఇందుకే…
అలానే ఈ రోజు తప్పకుండా ఈ శ్లోకం స్మరించుకోవాలి..
నమోస్తుతే వ్యాస విశాల బుద్దే పుల్లార విందాయత పత్రనేత్ర |
వినత్వయా భారత తైల పూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమాయః ప్రదీపః
న గురోరధికం తత్త్వం న గురోరధికం తపః |
తత్త్వఙ్ఞానాత్పరం నాస్తి తస్మై శ్రీగురవే నమః
(’గురువును మించిన తత్వం తపస్సు జ్ఞానం వేరొకటి లేవు’)
గురుపౌర్ణమినాడు వ్యాసులవారు రచించిన ఏ గ్రంథం చదివినా , చాలా మంచిది. గురుపీఠానికి ఆద్యులైన నారాయణుడిని , సదాశివుడిని , బ్రహ్మదేవుడిని , వసిష్ఠులవారిని , శక్తిమునిని , పరాశరుడిని , వ్యాసులవారిని , శుకమహామునిని , గౌడపాదులవారిని , గోవింద భగవత్పాదులను, శంకరాచార్యులవారిని ఈ రోజు పూజిస్తే విశేషఫలం లభిస్తుంది. అంతేకాదు తమ గురువులను కూడా ప్రతి ఒక్కరూ ఈ రోజున గౌరవించి పూజించాలి.
16. ధనుంజయుడు
17. కృతంజయుడు
18. సంజయ
19. భరద్వాజ
20 గౌతమ
21. ఉత్తముడు
22. వాజశ్రవ
23. సోమశుష్మాయణ
24. ఋక్షుడు
25 శక్తి
26. పరాశరుడు
27. జాతూకర్ణి ప్రస్తుతం 28 వ వేదవ్యాసుని పేరు కృష్ణద్వైపాయనుడు.
ఆయన జన్మించిన తిథి అయిన ఆషాఢ శుద్ధ పూర్ణిమను గురు పూర్ణిమ గా జరుపుకుంటాం. లోకానికంతటికీ జ్ఞానాన్ని అందించిన గురువు వ్యాసుడు కాబట్టి వ్యాసుని జన్మ తిథిని గురు పూర్ణిమగా జరుపుకోవడం ఆచారమైంది.
28 వ వేద వ్యాసుల వారి జయంతి. ఇతడు పరాశర మహర్షికి , మత్స్య గంధికి (సత్యవతి) కి కృష్ణ వర్ణం (నల్లని రంగు) తో ఒక ద్వీపంలో జన్మించారు కనుక కృష్ణద్వైపాయనుడు అని పిలవబడ్డాడు. పుట్టీ పుట్టగానే చేతిలో కమండలం , దండము చేతబట్టి తపస్సు చేసుకోవటానికి వెళ్తానని తల్లి మత్ష్యగంధి అనుమతితో తపస్సుకు వెళ్ళిన తపోధనుడు కృష్ణద్వైపాయనుడు.
వ్యాస మహర్షి నాలుగు వేదాలను విభజించి లోకానికి అందించాడని పురాణాలు చెబుతున్నాయి. పూర్వం సోమకాసురుడు వేదాలను సముద్రంలో దాచేస్తే.. శ్రీ మహా విష్ణువు మత్స్యావతారంలో ఆ వేదాలను తీసుకొచ్చాడు. అలా వచ్చిన వేదాలు ఒకదానితో ఒకటి కలిసి కలగాపులగం అయిపోగా.. వాటిని వ్యాస మహర్షి విడదీసి విభజించి నాలుగు వేదాలుగా లోకానికి అందించాడు. వేదరాశి ని నిత్య కర్మలలో క్రతువుల్లో వాడే ఉపయోగాలను బట్టి ఋక్-యజుర్-సామ-అధర్వణ వేదాలుగా విభజించి వేదవ్యాసుడైనాడు. ఆతర్వాత బ్రహ్మదేవుని ఆజ్ఞతో విఘ్నేశ్వరుడు రాయగా … వేదసారాన్నంతా చేర్చి పంచమవేదంగా ప్రసిద్ధికెక్కిన భారత ఇతిహాసాన్ని గ్రంధస్తం చేసాడు. అంతేకాక భాగవతాన్ని , అష్టాదశ పురాణాలను మనకు ప్రసాదించాడు. సాక్షాతు శ్రీ మహా విష్ణువు అవతారంగా భావించే వ్యాస భగవానుని గానూ ఆదిగురువుగానూ భావిస్తారు.
విష్ణుసహస్ర నామ కర్త
“వ్యాసాయ విష్ణు రూపాయ – వ్యాస రూపాయ విష్ణవే
నమోవై బ్రహ్మ నిధయే వాశిష్టాయ నమోనమ: !!
అని వ్యాసునికి విష్ణువుకు అభేదం చెప్ప బడింది , వేదవ్యాసుడు అనంతంగా ఉన్న వేదాలని విభజించి పైలుడను శిష్యునకు ఋక్సంహితను , వైశంపాయనునకు యజుస్సంహితను , జైమినికి సామసంహితను , సుమంతునకు అధర్వణ సంహితను భోధించి వానిని లోకములో వ్యాప్తి చేయండని ఆదేశించాడు. వ్యాసుడు వేదాలని విభజించటమే కాకుండా అష్టా దశ పురాణాల్ని , ఉపపురాణాలను రచించాడు. బ్రహ్మసూత్రాల్ని వివరించాడు , భారత , భాగవతాలని రచించాడు. తాను గ్రంథస్థం చేసిన పురాణేతిహాసములను సూతునకు తెలియజేసి ప్రచారం చేయమని చెప్పాడు.
వ్యాస భగవానుని అనుగ్రహం వలన జ్ఞానం విస్తరించి విశ్వవ్యాప్తం అయ్యింది. సూత మహాముని ప్రథాన ప్రచారకుడై విషయములు బహుళ ప్రచారం చేసాడు.
స్మృతి కర్తలలో వ్యాసులవారు ఒకరు. రెండధ్యాయముల ఈ గ్రంథానికి లఘు వ్యాస స్మృతి అని పేరు. ఇందులో మానవులకు ఉపయోగ పడే ఆచార విషయములు ఉన్నాయి. ఇదే వ్యాస సంహిత గా విఖ్యాతి పొందింది.
వ్యాస మహర్షి సుపుత్రుని కోసం తపస్సు చేసి శివుని నుంచి వరాన్ని పొందాడు. ఆయనకు ఘృతాచి అనే అప్సరస వలన బ్రహ్మ జ్ఞాని ఐన శుకుడు జన్మించాడు.
వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే , పౌత్రమకల్మషమ్ |
పరాశరాత్మజమ్ వందే శుక తాతం తపోనిధిమ్
తాత్పర్యం:- వశిష్టుని మునిమనుమడైన కల్మష రహితుడైన శక్తికి మనుమడైన పరాశరుని కుమారుడైన , శుకమహర్షి తండ్రి అయిన ఓ వ్యాస మహర్షి నీకు వందనము.
” వ్యాసో నారాయణో హరిః ” అన్నారు. వ్యాస భగవానులు సప్త చిరంజీవులలో ఒకరు.
మహాభారత రచన
మహాభారత రచనకు తనమనసులో ఒక ప్రణాళికను తయారుచేసుకొన్నాడు వేదవ్యాసుడు. తాను చెబుతుంటే….. అంత వేగంగా వ్రాసే వారు ఎవరు ఉన్నారూ అని విచారంలో ఉండగా….. బ్రహ్మ వ్యాసుని కోరికను గుర్తించి , అతని ఎదుట ప్రత్యక్షమయ్యి “వ్యాసా ! నీ కావ్యరచనకి, తగినవాడైన గణపతిని స్మరించు.” అని తెలిపి అద్రుశ్యమయ్యాడు. అంతట వ్యాసుడు గణేశుని ప్రార్థించగా…. గణేశుడు ప్రత్యక్షమయ్యాడు. నేను మనసులోనే రచించిన భారతాన్ని నేను చెబుతూ ఉంటే నీవు వ్రాయాలి అని కోరాడు వ్యాసుడు. సరే అని ఒక షరతు పెట్టాడు గణేశుడు. నేను వ్రాసే ఘంటం ఆగకుండా నీవు చెప్పాలి. నా ఘంటం ఆగిన యెడల నేను వ్రాయను అని అన్నాడు. దానికి వ్యాసుడు అంగీకరించి నేను చెప్పిన శ్లోకాలను అర్థం చేసుకొని నీవు వ్రాయాలి అని అన్నాడు…. ఈ నియమానికి అంగీకరించాడు గణపతి. ఇలా వేద ధర్మాలను ప్రతిపాదిస్తూ వేదవ్యాసుడు చెబుతూ ఉంటే , నాలుగు వేదాల సారమైన పంచమవేదం అని మనం చెప్పుకొనే మహాభారతం అవతరించింది.
ఈయన వల్లే కురువంశం అభివృద్ధి చెందింది. తల్లి కోరికపై దృతరాష్టుని , అంబాలికకు పాండు రాజుని , అంబిక దాసికి విదురుని ప్రసాదించినాడు. పాండవాగ్రజుడైన ధర్మరాజుకి ప్రతిస్మృతిని ఉపదేశించింది వ్యాసుడే ! దానిని ధర్మరాజు ద్వారా అర్జునుడు ఉపదేశం పొంది దేవతలను మెప్పించి అస్త్రశస్త్రాలుపొందాడు. కురుపాండవ చరిత్ర ఖ్యాతి పొందేట్లుగా మూడు సంశ్ర…మించి జయం అనే పేరు మీద వారి గాథలు గ్రంథస్థం చేసాడు వ్యాసుడు. ఆ జయమే మహా భారతమైంది.
కలియుగంలో మానవులు అల్పబుద్ధులు , అల్పాయువులై ఉంటారు. అందుకే మన ప్రాచీనులు పరమ ప్రామాణికంగా…. అంగీకరించిన వేదాన్ని అధ్యయనం చేయలేరు. అర్థం చేసుకోలేరు.
వేదమంటే అసలు ఎవరూ తయారుచేసింది కాదు. స్వయం భగవానుని ముఖతః వేలువడినదే వేదము. అందుకే అతనిని “వేదపురుషుడు” అని అంటారు. వేదములో విషయాలు ఉన్నాయి. వేదములో లేనివి— మరెక్కడా లేవు. ఇవన్నీ కలగాపులగంగా ఏక రూపంలో ఉంటాయి. దీనిని కలియుగంలో ఉన్న జనులు అర్థం చేసుకోలేరని, భగవానుడే ప్రతీ ద్వాపరయుగంలోనీ వ్యాసుడుగా అవతరించి , వేదాలను విభజిస్తాడు మందబుద్దుల కోసం వేదాధ్యాయానికి , అవకాశం లేనివారికోసం వేదంలోని విశేషాలను , ఇతిహాస పురాణాల ద్వారా లోకానికి అందించాడు.
ప్రాచీన గాథలు , గత కల్పాలలో జరిగిన చరిత్రలు , సృష్టికి పూర్వం అనేక సృష్టులలో జరిగిన విశ్వం యొక్క పూర్వ వృత్తాంతం మన పురాణాల్లో నిగూఢంగా నిక్షిప్తమయినాయి. ఎవరు వాటిని అర్ధం చేసుకోవాలన్నా , ఇతరులకి చెప్పాలన్నా అంతరార్ధాలతో బోధించాలన్న వ్యాస మహర్షి అనుగ్రహం అత్యవసరం. వ్యాస మహర్షి అంశ లేనిదే ఎవరూ పురాణ గాథల్ని చెప్పలేదు , చదవలేదు. అందుకే వ్యాసపూర్ణిమ నాడు వ్యాస పూజను తప్పక చేయాలంటారు. ఈ పర్వము యతులకు అతి ముఖ్యం ! వ్యాస పూర్ణిమ పర్వాన్ని ఆదిలో శంకరాచార్యులు ఏర్పాటు చేశారని చెబుతారు.
Follow Us On : YouTube , Google News