పాట్నా : బీహార్లోని ముజఫర్పూర్ జిల్లాలో ముంబైకి వెళ్లే పవన్ ఎక్స్ప్రెస్ విరిగిన చక్రంతో 10 కి.మీ పరుగెత్తడం , ఆ ప్రమాదం నుండి ప్రయాణికులు తప్పించుకోవడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించిందిఆదివారం అర్థరాత్రి భగవాన్పూర్ రైలు వద్ద ముజఫర్పూర్-హాజీపూర్ రైలు సెక్షన్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రయాణికులు తెలిపిన వివరాల మేరకు , రైలు ముజఫర్పూర్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరిన వెంటనే, S-11 కోచ్లో పెద్ద శబ్దం వినిపించిందని వేగంగా వెళుతున్న రైలు భగవాన్పూర్ రైల్వే స్టేషన్కు చేరుకున్నప్పుడు సమస్యను గుర్తించే ప్రయత్నాలు చేయలేదన్నారు .”రైలు భగవాన్పూర్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరినప్పుడు, ప్రయాణికులు చైన్ లాగి ఆపారు” అని ఆ రైలు లో ప్రయాణిస్తున్న ప్రయాణీకుడు రాజు కుమార్ తెలిపారు.
ఆ తర్వాత ప్రయాణికులు రైల్వే ఉద్యోగులతో పాటు రైలు డ్రైవర్, గార్డులకు సమాచారం అందించగా , తనిఖీల్లో ఎస్-11 కోచ్ చక్రం విరిగిపోయినట్లు గుర్తించారు రైల్వే అధికారులు . రైల్వే ఇంజినీర్లు, ఉద్యోగులు రైల్వే స్టేషన్కు చేరుకుని చక్రాన్ని సరిచేశారు.“పవన్ ఎక్స్ప్రెస్లో చక్రం విరిగిందని మాకు సమాచారం అందడం తో మా బృందం అక్కడికి చేరుకుని లోపాన్ని సరిచేసాం ” అని తూర్పు మధ్య రైల్వే హాజీపూర్ CPRO వీరేంద్ర కుమార్ తెలిపారు.
Follow Us On : YouTube , Google News