అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో సోమవారం ఓ పోలీసు అధికారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.తాడిపత్రి పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆనందరావు (52) తెల్లవారుజామున తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు .
ఆయన గత తొమ్మిది నెలలుగా తాడిపత్రి సీఐగా విధులు నిర్వహిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడిపత్రి పట్టణంలోని సీపీఐ కాలనీలోని తన అద్దె ఇంట్లో సీఐ ఆత్మహత్య చేసుకున్నారు .వివాహేతర విభేదాల కారణంగానే పోలీసు అధికారి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.గత కొన్ని రోజులుగా ఆనందరావు, ఆయన భార్య అనురాధ తరచూ గొడవ పడుతున్నారు.
ఆదివారం రాత్రి వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. భార్య, కుమారులు ఇద్దరూ నిద్రించిన తర్వాత సీఐ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది . కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గత మూడు నెలలుగా పోలీసు అధికారి తీవ్ర పని ఒత్తిడికి గురవుతున్నాట్టు , గత ఏడాది సెప్టెంబర్లో కూడా కడప నుంచి తాడిపత్రికి బదిలీ అయ్యారుని తెలిపారు .ఆయన స్వస్థలం చిత్తూరు జిల్లా చంద్రగిరి. ఆత్మహత్యగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి విచారణ చేపట్టారు.
Follow Us On : YouTube , Google News