ఆంధ్రప్రదేశ్ లో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది. ఈరోజు ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో ఏపీలోని పలు జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఈరోజు నుంచి జులై 7వ తేదీ వరకూ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ఈరోజు ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడి రానున్న రోజుల్లో అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఈ జిల్లాల్లో…
ఈరోజు, రేపు తూర్పు గోదావరి, బాపట్ల, కృష్ణా, ఏలూరు, కోనసీమ, ప్రకాశం, పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు కర్నూలు, నంద్యాల, అనకాపల్లి జిల్లాల్లోనూ ఒక మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఉత్తర కోస్తా, యానాంలో మాత్రం తేలికపాటి జల్లులు కురవనున్నాయని తెలిపింది. రాయలసీమలోనూ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.