భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం సీరియస్ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజును ఆ పదవి నుంచి తప్సించారు. సోము వీర్రాజు అధ్యక్ష పదవీకాలం ముగియడంతో ఆయనను తప్పిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు సోము వీర్రాజుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫోన్ చేసి చెప్పారు. పదవీ కాలం పూర్తి కావడం కారణంగానే పదవి నుంచి తప్పిస్తున్నామని జేపీ నడ్డా సోము వీర్రాజుతో చెప్పినట్లు తెలిసింది.
పదవికి రాజీనామా చేయాలంటూ…
వెంటనే పదవికి రాజీనామా చేయాలని కూడా జేపీ నడ్డా సోము వీర్రాజును ఆదేశించింది. దీంతో ఈరోజు, రేపట్లో పార్టీ అధ్యక్ష పదవికి సోము వీర్రాజు రాజీనామా చేయనున్నారు. అయితే కొత్త అధ్యక్షుడు ఎవరన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. సత్యకుమార్ పేరు బలంగా వినపడుతుంది. సత్యకుమార్ తో పాటు సుజనా చౌదరి పేరు కూడా వినిపిస్తుంది. త్వరలోనే ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నారు. ఎవరు అన్న దానిపై త్వరలోనే క్లారిటీ రానుంది.
బండిని కూడా…
ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను కూడా తప్పించనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బండి సంజయ్ ను కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకునే అవకాశముంది. ఆయన స్థానంలో కిషన్ రెడ్డిని నియమించాలని కేంద్ర నాయకత్వం భావిస్తుంది. రానున్న ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసేందుకు పార్టీ అధ్యక్షులను మార్చారని అంటున్నారు. సోము వీర్రాజుకు కూడా పార్టీలో కీలక పదవి లభించే అవకాశాలున్నాయి. మొత్తం మీద ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి సోము వీర్రాజును తప్పించడంతో పొత్తుల విషయంలో కొంత క్లారిటీ వచ్చే అవకాశముందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
Follow Us On : YouTube , Google News