మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వాహనాలపైకి కంటైనర్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పది మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముప్ఫయి మందికి తీవ్రగాయాలయ్యాయి. మహారాష్ట్రలోని ధూలే జిల్లా సిర్పూర్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక భారీ ట్రక్కు రోడ్డుపక్కనే ఆగిన వాహనాలను ఢీకొట్టి హోటల్ లోకి వెళ్లింది. ఈ ట్రక్కు మధ్యప్రదేశ్ నుంచి ధులే వెళుతుంది.
వేగంగా వచ్చిన ట్రక్కు…
ముంబయి – ఆగ్రా హైవేపై ఈ ప్రమాదం జరిగింది. అయితే ట్రక్ బ్రేకులు ఫెయిలవ్వడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని డ్రైవర్ చెబుతున్నారు. బ్రేకులు ఫెయిల్ కావడంతో ట్రక్కును డ్రైవర్ ఆపలేకపోయాడని, అందువల్లనే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని పోలీసులు సయితం తెలిపారు. ఈ ట్రక్కు వేగంగా వచ్చి రెండు బైక్ లు, కారుతో పాటు మరో కంటైనర్ ను కూడా ఢీకొట్టింది.
హోటల్ లో ఉన్న…
నేషనల్ హైవే పైన ఉన్న ఒక హోటల్ లోకి దూసుకెళ్లడంతో అందులో ఉన్న వారు మృత్యువాత పడ్డారు. వెంటనే స్థానికులు ప్రమాదంలో గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. వారికి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలికి చేరుకుని ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Follow Us On : YouTube , Google News