ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఖరారయింది. ఈ నెల 8వ తేదీన నరేంద్ర మోదీ వరంగల్ లో పర్యటించనున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్ ను ప్రధానమంత్రి కార్యాలయం ఖరారు చేసింది. ఈనెల 8వ తేదీన ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరి 9.45 గంటలకు హైదరాబాద్ లోని హకీంపేట విమానాశ్రయానికి ప్రధాని చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఆయన వరంగల్ బయలుదేరి వెళతారని పార్టీ వర్గాలు తెలిపాయి.
వివిధ కార్యక్రమాలకు…
ఉదయం 10.45 గంటల నుంచి 11.20 గంటలవరకూ వరంగల్ లో నరేంద్ర మోదీ పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం ఆయన హెలికాప్టర్ లో వరంగల్ నుంచి హైదరాబాద్కు చేరుకుని అక్కడినుంచి ప్రత్యేక విమానంలో నేరుగా రాజస్థాన్ పర్యటనకు వెళతారు. రాజస్థాన్ లో జరగనున్న ప్రచారంలో ఆయన పాల్గొననున్నారు. కాగా ప్రధాని వరంగల్ పర్యటనకు సంబంధించి పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Follow Us On : YouTube , Google News