మణిపూర్ ఇంకా మండుతూనే ఉంది. హింస చెలరేగుతూనే ఉంది. అల్లర్లు ఆగడం లేదు. సైన్యం మొహరించి ఉన్నప్పటికీ ఆందోళనకారులు నిత్యం ఏదో ఒక రీతిలో తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు కాల్పులు జరగడంతో సైన్యం, పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయుధాలను లూటీ చేసేందుకు ఒక వర్గం వారు చేసిన ప్రయత్నాలను సైనికులు సమర్థవంతంగా అడ్డుకున్నారు.
వ్యక్తి మృతి…
ఈరోజు జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి మరణించాడు. మణిపూర్ రాష్ట్ర్రంలోని దౌబాల్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సైన్యం తాము అల్లర్లకు దిగే ప్రాంతాలకు రాకుండా ఆందోళన కారులు ముందుగానే రోడ్లను తవ్వేశారు. మణిపూర్ లో గత రెండు నెలలుగా రెండు వర్గాల మధ్య చెలరేగిన చిచ్చు హింసాత్మకంగా మారింది.
ఎంత ప్రయత్నించినా…
పోలీసులు ఎంత అదుపు చేసినా ఎక్కడో ఒక చోట ఘర్షణలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అఖిలపక్షం ఏర్పాటు చేసి మణిపూర్ లో శాంతియుత పరిస్థితులను నెలకొల్పేందుకు చర్యలు తీసుకున్నప్పటికీ ఫలితం లేదు. అనేక చోట్ల చెక్ పోస్టులను ఏర్పాటు చేసి అప్రమత్తంగా ఉన్నప్పటికీ నిత్యం ఏదో ఒక చోట హింస చెలరేగుతూనే ఉంది. ఇప్పటికే హింసకు పాల్పడిన 300 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Follow Us On : YouTube , Google News