మోహన్ బాబు కూతురు , సినీ నటి మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ వారికి దగ్గరగా ఉంటుంది. ఇటీవల గద్వాల జిల్లాలో 30 ప్రభుత్వ బడులను దత్తత తీసుకుని అందరి ప్రశంసలు అందుకుంది మంచు లక్ష్మి . తాజాగా, ఓ ఇంటర్వ్యూలో మంచు లక్ష్మీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు అంతే కాదండోయ్ ప్రేక్షకులపై కూడా ఫైర్ ఆమే ఫైర్ అయ్యారు . ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ..
“నేను హాలీవుడ్ యాక్టర్ని.. ఒకటి కాదు చాలా సినిమాలు చేశాను. వాటన్నిటిని వదిలేసి టాలీవుడికి వచ్చాను. నేను హాలీవుడ్లోనే కనక ఉండి ఉంటే ఈ పదేళ్లలో నేను ఎక్కడో ఉండేదాన్ని. నాకేం కర్మ పట్టింది ఇక్కడికి వచ్చేశాను అని నేను ఇప్పుడు అనుకుంటున్నాను. పెళ్లై పాప కావాలి అనుకున్న టైంలో.. నాకు ఇక్కడ ఉంటేనే మంచిదనిపించింది. ఇక్కడ ఉంటే అన్నీ సక్రమంగా ఉంటాయి. ఫ్యామిలీకి దగ్గరగా ఉండొచ్చు అనుకోని హాలీవుడ్ నుంచి వచ్చేశాను.
లేదంటే నా పరిస్థితి వేరేలా ఉండేది. ఇప్పుడు పాపకి తొమ్మిదేళ్లు వచ్చేశాయి కాబట్టి నాకు రెక్కలొచ్చాయి. దేవుడు దయ తలచితే మళ్లీ హాలీవుడికి వెళ్లొచ్చు. ఆ దేవుడు కమాన్ అంటే నిమిషం ఆలస్యం చేయకుండా వెంటనే అక్కడికే వెళ్లిపోతాను. మన తెలుగు ఆడియన్స్ ఎలాంటి వాళ్లంటే.. వేరే ప్రాంతాలు, వేరే స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్లని విపరీతంగా ప్రేమిస్తారు. మీ ఊరిలో ఉండే అమ్మాయిని ఒక్క శాతం ప్రేమించినా వాళ్లు ఎక్కడో ఉండేవారని ఆమే ఆవేదన వ్యక్తం చేసారునటి మధుశాలిని మన తెలుగు అమ్మాయే తను ఎందుకు సినిమాలు చేయడం లేదు.. బిందు మాధవి ఎందుకు చేయడం లేదు.. శివాని ఎందుకు చేయడం లేదు.. నిహారిక ఎందుకు చేయడం లేదు..
మనకంతా తెలుగు ప్రేక్షకులకు కేరళ, తమిళ, పంజాబీ, ముంబై, మధ్యప్రదేశ్, గుజరాత్ నుంచి వచ్చిన వారె కావాలి. తెలుగు వారు మాత్రం వద్దు. మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి . అందం విషయంలో నాకు నిహారికకు ఏం తక్కువ. తెలుగు అమ్మాయిలు ప్రజలకు నచ్చడం లేదు. అక్కడే సమస్య వస్తుంది. పోనీ నేనే ప్రొడక్షన్ హౌస్ పెట్టి తెలుగు వాళ్లకు అవకాశాలు ఇద్దామా? అంటే.. నాకే సినిమాలు లేవు.. ఇప్పుడు వాళ్లందర్నీ తీసుకొచ్చి నేనేం చేయాలి. నేను జనాలను అడుగుతున్నాను” అంటూ ఆమే ఫైర్ అయ్యారు . ఇంతకీ ఇన్నేళ్ల మీ ప్రయాణంలో మిమ్మల్ని ఎవరైనా మోసం చేశారా? అని అడిగిన ప్రవ్నకు లక్ష్మీ మంచు మాట్లాడుతూ..
‘‘నాకేముంది నేను మోహన్ బాబుగారి అమ్మాయిని కదా! నన్నెవరూ ఏం చేస్తారు? అనే ఫీలింగ్ నాకు బాగా ఉండేది. అయితే కొందరు నన్ను కూడా మోసం చేశారు. అస్సలు వాళ్లు అలా చేస్తారని అనుకోలేదు’’ అని పీల్ అయ్యారు లక్ష్మీ మంచు. నేను బయటకు చెప్పకోలేను. ఎందుకంటే అలా చెబితే వాళ్లని ఫేమస్ చేసినట్లు అవుతుంది. ఇంట్లో జరిగింది బయట పెట్టినట్లు అవుతుంది. నమ్మిన వాళ్లే మోసం చేస్తారు. నమ్మి బుట్టలో వేసి మోసం చేస్తారు. అలా మోసం చేసినప్పుడు గుండె బద్దలైనట్లు ఉంటుంది.ప్రస్తుతం మంచు లక్ష్మీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ మంచు లక్ష్మి చేసిన వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
Follow Us On : YouTube , Google News