కర్ణాటక ఎన్నికలలో ఇటీవల గెలిచిన మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డి నామినేషన్ లో లోపాలున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా అధికారిని ఆ లోపాలను కనుగొనాలని ఆదేశించింది. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో గాలి జనార్థన్ రెడ్డి తనకు పట్టున్న బళ్లారి ప్రాంతంలోని గంగావతి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. గాలి కుటుంబ సభ్యులు పోటీ చేసినా ఎవరూ గెలుపొందలేకపోయారు.
నామినేషన్ పత్రాల్లో…
అయితే గాలి జనార్థన్ రెడ్డి నామినేషన్ సమయంలో ఆస్తులు, కేసులకు సంబంధించి సరైన సమాచారం ఇవ్వలేదని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు అందింది. సరైన సమాచారం ఇవ్వకుండా గాలి ఎన్నికల కమిషన్ ను తప్పుదోవ పట్టించారంటూ అనంతపురానికి చెందిన గనుల యజమాని టపాల్ శ్యాంప్రసాద్ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆయన నామినేషన్ పత్రాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని కర్ణాటక ఎన్నికల అధికారి స్థానిక జిల్లా ఉన్నతాధికారిని ఆదేశించారు.
Follow Us On : YouTube , Google News