జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ విడాకుల పుకార్లు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. మూడో భార్య అన్నా లెజ్నేవాకు పవన్ విడాకులు ఇవ్వనున్నారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఓవైపు జనసేన పార్టీ తరఫున వారాహి విజయ యాత్ర చేస్తున్నారు పవన్. సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇలా అన్ని బాధ్యతలను నిర్వర్తిస్తూ దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ఈ తరుణంలో భార్య అన్నా లెజ్నేవాతో పవన్ కల్యాణ్ విడిపోనున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. చాలా కాలంగా కుటుంబ కార్యక్రమాల్లో ఆమె కనిపించకపోవడాన్ని దీనికి సాకుగా చూపుతూ ప్రచారం జరుగుతోంది. మరోవైపు, పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన నాయకులు ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ తరుణంలో జనసేన పార్టీ అధికారికంగా క్లారిటీ ఇచ్చింది. విడాకుల పుకార్లను పరోక్షంగా ఖండించింది.
జనసేనాని, పవర్స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్లో బిజీగా ఉన్నారు. ఆయన తలపెట్టిన ‘వారాహి విజయ యాత్ర’ మొదటి దశ ఇటీవలే సక్సెస్ఫుల్గా ముగిసింది. మరికొద్ది రోజుల్లో రెండవ దశ ప్రారంభం కానుంది. ఈ లోపుగా పవన్ ‘ఉస్తాద్ భగత్సింగ్’ సెకండ్ షెడ్యూల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. పవన్ కళ్యాణ్ తన మూడో భార్య అన్నా లెజినోవాతో విడిపోయారనే న్యూస్ రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే వాళ్లిద్దరూ సోషల్గా దూరంగా ఉంటున్నారని, త్వరలోనే లీగల్గా విడిపోనున్నారనేది ఆ వార్తల సారాంశం. ఈ న్యూస్తో పవన్ ఇమేజ్కు డ్యామేజ్ కలిగే పరిణామాలు తలెత్తాయి. దీంతో విడాకుల వార్తను ఖండిస్తూ జనసేన అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్ నుంచి తాజాగా పోస్ట్ పెట్టింది.
వారాహి విజయ యాత్ర తొలి దశ దిగ్విజయంగా పూర్తి చేసుకొన్న సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఆయన భార్య అనా కొణిదెల కలిసి పూజలు నిర్వహించారు. హైదరాబాద్ లోని తమ నివాసంలో నిర్వహించిన పూజాదికాలలో వారిద్దరూ పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా చేపట్టిన ఈ ధార్మిక విధులను పవన్ కళ్యాణ్, అనా కొణిదెల దంపతులు నిర్వర్తించారు. కొద్ది రోజుల్లో వారాహి విజయ యాత్ర తదుపరి దశ మొదలవుతుంది. ఇందుకు సంబంధించిన సన్నాహక సమావేశాల్లో పాల్గొనేందుకుపవన్ కళ్యాణ్ త్వరలో మంగళగిరి చేరుకుంటారని జనసేన అధికారిక ఖాతాలో ట్వీట్ చేశారు.
అయితే, పవన్ కల్యాణ్ తాజాగా ఆయన భార్యతో ఉన్న ఫోటోను ట్వీట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. మెగా కుటుంబంలో నిహారిక, జొన్నలగడ్డ చైతన్య విడాకులకు దరఖాస్తు చేసుకున్నప్పటి నుంచి పవన్ కల్యాణ్, ఆయన భార్య అనా కొణిదెల కూడా విడాకులు తీసుకోబోతున్నారంటూ పుకార్లు వచ్చాయి. కొన్ని మీడియా సంస్థలు వీరి విడాకులు తీసుకోబోతున్నారా? అని అనుమానం వ్యక్తం చేస్తూ వార్తలు ప్రచురించాయి. అందుకు గల కారణాలను కూడా పేర్కొ్న్నాయి. ఇటీవల పవన్ కల్యాణ్ తో ఆయన భార్య కనిపించలేదని, వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్ సమయంలో కూడా పవన్ కల్యాణ్ ఒక్కరే రావడంతో వీరు విడిపోయినట్లుగా కొన్ని మీడియా సంస్థలు వార్తలు రాశాయి. తాజాగా ఒక్క ఫోటోతో పవన్ కల్యాణ్ ఈ పుకార్లకు చెక్ పెట్టినట్లు అయింది.
Follow Us On : YouTube , Google News