దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ ఫాంలోకి వచ్చాయి. ఇవాళ ఆరంభం అంతంత మాత్రంగానే ఉన్న సెన్సెక్స్, నిఫ్టీ తర్వాత జోరందుకున్నాయి. క్లోజింగ్ బెల్ సమయానికి నిఫ్టీ 98.80 పాయింట్ల లాభంతో 19497.30 దగ్గర ముగిసింది. అలాగే సెన్సెక్స్ కూడా 339.60 పాయింట్ల లాభంతో 65785.64 దగ్గర ముగిసింది.
లాభాలతో ఇవీ…
ఇక అపోలో హాస్పటల్స్, ఎం అండ్ ఎం, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, టాటా మోటార్స్, రిలయన్స్ కంపెనీలు లాభాలతో ముగిశాయి. అలాగే ఎకర్ మోటార్స్, హెచ్ డీఎఫ్ సీ లైఫ్, మారుతి సుజుకీ, హెచ్ సీఎల్ టెక్, బజాజ్ ఫైనాన్స్ కంపెనీలు ఇవాళ నష్టాలతో ముగిశాయి. ఇక డాలర్ తో పోలిస్తే మన రూపాయి మారకం 82 రూపాయల 55 పైసల దగ్గర ముగిసింది.
Follow Us On : YouTube , Google News