గుజరాత్ హైకోర్టులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (rahul gandhi) కి ఎదురు దెబ్బ తగిలింది. స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. తనకు స్టే ఇవ్వాల్సిందిగా రాహుల్ వేసిన పిటీషన్ ను గుజరాత్ హైకోర్టు కొట్టి వేసింది. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన వ్యాఖ్యలతో పార్లమెంటు సభ్యత్వం కోల్పోవాల్సి వచ్చింది. 2019 లోక్ సభ ఎన్నికల సందర్భంగా కర్ణాటకలోని కోలార్ బహిరంగ సభలో దొంగల ఇంటి పేరు మోదీ ఎలా అవుతుందని ప్రశ్నించారు. దీనిపై గుజరాత్ కు చెందిన పూర్ణేశ్ మోదీ సూరత్ కోర్టులో పరువు నష్టం దావా కేసు వేశారు. ఈ కేసులో సూరత్ కోర్టు దోషి అని నిర్ధారించింది. రెండేళ్ల జైలు శిక్షతో పాటు ఆయన చట్టసభల్లో సభ్యుడిగా ఉండటానికి అనర్హుడని తేల్చింది.
సుప్రీంకోర్టును…
దీంతో రాహుల్ గాంధీని వెంటనే లోక్ సభ పార్లమెంటు కార్యాలయం రాహుల్ ను ఎంపీ పదవి నుంచి తప్పించింది. ఆయన తన అధికార బంగళాను కూడా ఖాళీ చేశారు. సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో కూడా రాహుల్ గాంధీకి అనుకూలంగా తీర్పు రాలేదు. స్టే ఇచ్చేందుకు నిరాకరించడమే కాకుండా వేసవి సెలవుల తర్వాత దీనిపై తీర్పు చెబుతామని పేర్కొంది. గుజరాత్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయి.
Follow Us On : YouTube , Google News