తెలంగాణలో మరో పెద్ద రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరు బోగీలు పూర్తిగా దగ్దమయ్యాయి. హావ్ డా నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగాయి. రెండు బోగీల్లోనుంచి మంటలు రావడంతో వెంటనేరైలు ఆపేశారు. మంటలు వస్తున్న రెండు బోగీల నుంచి ప్రయాణికులను దించి వేయడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ప్రయాణికుల భయభ్రాంతులకు గురై రైలు నుంచి కొందరు దూకేశారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రయాణికులు చైన్ లాగి రైలును నిలిపివేయడంతో మిగిలిన బోగీలకు మంటలు అంటుకోకుండా పెను ప్రమాదం తప్పిందని రైల్వే శాఖ అధికారులు చెబుతున్నారు.
షార్ట్ సర్క్యూట్…
అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అధికారులు చెబుతున్నారు. ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఎవరూ గాయపడలేదు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలోని పగిడిపల్లి నుంచి బొమ్మాయిపల్లి మధ్య జరిగింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. రైల్వే శాఖ అధికారులు దీనిపై విచారణకు ఆదేశించారు.
రైళ్ల రద్దు..
దగ్దమైన రైలు బోగీలను సిబ్బంది తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఒడిశా రైలు ప్రమాదం మరవకముందే మరో ఘటన చోటు చేసుకోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంతో కొిన్ని రైళ్లను రద్దు చేసినట్లు తెలిసింది. రెండు రైళ్లను రద్దు చేసినట్లు అధికారికంగా దక్షిణమధ్మ రైల్వే అధికారులుప్రకటించారు. సాయంత్రం ఆరు గంటలకు గాని ట్రాక్ పునరుద్ధరణ జరగదని అధికారులు చెబుతున్నారు.
Follow Us On : YouTube , Google News