ముంబై: దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో 5జీ నెట్ వర్క్ పరికరాలను కొనుగోలు చేసేందుకు నోకియాతో భారీ ఒప్పందం చేసుకుంది. గురువారం ఇరు సంస్థల మధ్య ఈ ఒప్పందం జరిగినట్లు, దాని విలువ సుమారు రూ. 14,000 కోట్లని తెలుస్తోంది. నోకియా ప్రధాన కార్యాలయం ఉన్న ఫిన్లాండ్లో కాంట్రాక్ట్ పై రెండు కంపెనీలు సంతకాలు చేసినట్లు తెలుస్తుంది .
2022, ఆగష్టులో 5జీ స్పెక్ట్రమ్ వేలంలో జియో పాల్గొంది .ఈ వేలం లో జియో సుమారు రూ.90,500 కోట్ల విలువైన స్పెక్ట్రమ్ను ను దక్కించుకుంది. అనంతరం జియో అత్యంత వేగంగా తన 5జీ నెట్వర్క్ సేవలను విస్తరించింది. అంతేకాకుండా టెక్ దిగ్గజం గూగుల్ తో కలిసి 5జీ స్మార్ట్ ఫోన్ ల తయారీ కోసం కలిసి పనిచేస్తోంది.
ఇప్పటికే జియో 5జీ నెట్వర్క్ పరికరాల కోసం స్వీడన్కు చెందిన ఎరిక్సన్తో దాదాపు రూ.17 వేల కోట్ల ఒప్పందానికి ఇది అదనం. ఈ ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా తన 5జీ సేవలను పూర్తిగా అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నందున ఈ కొనుగోళ్లు జియోకు కీలకమని పారిశ్రామిక పేర్కొంటున్నాయి.
Follow Us On : YouTube , Google News