బలాన్ని ఉపయోగించి ఏ పని చేయాలన్నా ఎముకలు అనేవి చాలా దృఢంగా ఉండేలా చూసుకోవాలి. ఎముకలు ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత పని చేయగలం. సహజం గా మానవుని శరీరం లో 206 ఎముకలు ఉంటాయి. ఎముకలు గానీ బలహీనమైతే పదే పదే అనారోగ్యానికి గురవుతారు. అయితే ప్రస్తుత కాలంలో జంక్ ఫుడ్ తీసుకోవడం చాలామందికి అలవాటుగా మారింది. ఈ ఆహారం ఎముకలకు ఏ మాత్రం బలాన్ని ఆరోగ్యాన్ని ఇవ్వకపోగా అవి దెబ్బతినేలా చేస్తున్నాయి . ఎముకలు బలహీనంగా తయారై పెళుసుగా విరిగిపోయే ప్రమాదం కూడా ఉంది. ఎముకలు బలహీనం కావడానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం.
ఏ చిన్నా పార్టీకైనా, పెళ్లిళ్లు జరిగినా కూల్ డ్రింక్స్ అనేవి ఈ రోజుల్లో తప్పనిసరి అయిపోతున్నాయి . వాటిని జనాలు కూడా తెగ తాగేస్తున్నారు. కొంతమంది అయితే దాహం వేస్తే నీళ్లు కన్నా కూల్ డ్రింక్ లే తాగేస్తున్నారు. ఈ పానీయాలలో ఫాస్ఫేట్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల శరీరం నుంచి కాల్షియంను తొలగిస్తుంది. దీంతో ఎముకలు బలహీనంగా తయారవుతాయి. చిన్న చిన్న విషయాలకు చాలామంది ఆందోళన చెందుతుంటారు. ఈ ప్రభావం వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఎముకలు దృఢంగా ఉండాలంటే టెన్షన్ కి దూరంగా ఉండాలి. ఎందుకంటే టెన్షన్ వల్ల కార్టిసాల్ హార్మోన్ పెరుగుతుంది. దీని కారణంగా కాల్షియం శరీరం నుంచి మూత్రం ద్వారా బయటికి పోతుంది. ఎముకలు బలంగా ఉండాలంటే మాంసం, గుడ్లు, సోయాబీన్, పప్పులు వంటి వాటిని తీసుకోవాలి.
Follow Us On : YouTube , Google News