ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎష్ షర్మిల నివాళులర్పించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్ షర్మిల, విజయమ్మలు ఘాట్ వద్ద నివాళులర్పించారు. వీరితో పాటు షర్మిల కుమారుడు రాజారెడ్డి, కూతురు అంజలి కూడా ఉన్నారు. అక్కడ జరిపిన ప్రత్యేక ప్రార్థనల్లో షర్మిల పాల్గొన్నారు. వైఎస్ జయంతి సందర్భంగా నివాళులర్పించేందుకు షర్మిల నిన్ననే ఇడుపులపాయకు చేరుకున్నారు. తన తండ్రి ఆశయాలను కొనసాగిస్తానని షర్మిల అన్నారు.
ఆయనకే సాధ్యం…
ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడారు. తెలుగు ప్రజల మనసును దోచుకున్న నేత వైఎస్సార్ అని అని అన్నారు. తన పాలనలో ప్రజలకు ఎంతో మేలు చేశారన్న షర్మిల రైతులకు రుణమాఫీ చేయడం వైఎస్సార్ కే సాధ్యమయిందని చెప్పారు. వైఎస్సార్ అమలు చేసిన ఆరోగ్య శ్రీ , ఫీజు రీఎంబర్స్ మెంట్ వంటి పథకాలు పేద ప్రజలను ఆదుకున్నాయని తెలిపారు. ఐదేళ్లలో 46 లక్షల ఇళ్లు కట్టిన చరిత్ర కూడాఆయనకు దక్కిందన్నారు.