డయాబెటిస్..ఇప్పుడిదే అతి ప్రమాదకరమైన స్లో పాయిజన్ లాంటి వ్యాధి. ఇటీవలి కాలంలో మధుమేహం ప్రదాన సమస్యగా మారింది వయస్సుతో సంబంధం లేకుండా చాలామంది డయాబెటిస్ వ్యాధి బారిన పడుతున్నారు. సాధారణంగా జీవనశైలి సరిగ్గా లేకపోవడం, స్థూలకాయం కారణాలతో మధుమేహం వస్తుంది. డయాబెటిస్ వ్యాధి ఎప్పుడైనా ఎవరికైనా సోకవచ్చు. బ్లడ్ షుగర్ లెవెల్స్ అధికంగా ఉన్నప్పుడు ఈ వ్యాధి వస్తుందని వైద్యులు.
వేప ఆకులను ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం వలన మధుమేహ వ్యాధిగ్రస్తులకు సర్వరోగ నివారిణిలా పనిచేస్తుందని అంతే కాకుండా ఇది కడుపులో అల్సర్, బర్నింగ్, గ్యాస్, కుష్టు వ్యాధి, కంటి రుగ్మతలని ,కడుపు నొప్పి, ఆకలి లేకపోవడం, చర్మపు పూతల, గుండె మరియు రక్త నాళాల వ్యాధులు వంటి సమస్యలను కూడా తొలగిస్తుందని చెబుతున్నారు వైధ్యులు .వేప ఆకులు ఆరోగ్యానికి చాలా మంచివి అని తెలుసు మనకందరికీ తెలుసు కానీ దాని ఉప్పగించేవారు చాలా తక్కువ అనే చెప్పవచ్చు . ప్రస్తుతం చాలా మంది షుగర్ వ్యాధి భారిన పడుతున్నారు.
అలాంటి వారికి వేప ఆకులు చాలా మేలు చేస్తాయని , మధుమేహాన్ని నియంత్రించడంలో ఇవి చాలా ప్రభావవంతంగా పని చేస్తాయంటున్నారు వైద్యులు.మధుమేహ వ్యాధిగ్రస్తులు వేప ఆకులను ఉదయం పరగడుపున తినాలని యూపీలోని అలీఘర్ ఆయుర్వేద వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సరోజ్ గౌతమ్ చెప్పారు . ఇది వారి బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంచుతుంది. సమస్యలను నివారించవచ్చు. ఆయుర్వేదంలో వేప ఆకుల్లో చేదు, ఉసిరి రసం ఉంటుందని చెప్పబడిందన్నారు .
ఈ రెండు రసాలు మన శరీరంలోకి చేరి తీపి రసాన్ని అంటే రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తాయని చెబుతున్నారు. ఆయుర్వేద వైద్యుల అభిప్రాయం ప్రకారం వేప ఆకులలో శక్తివంతమైన ఫ్లేవనాయిడ్స్తో సహా అనేక ఔషధ గుణాలు ఉన్నందున ఇవి మన ప్యాంక్రియాస్ ను ఉత్తేజపరుస్తాయని . ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుందని తెలిపారు అందువలన మధుమేహా వ్యాధి గ్రస్తులు రోజు ఉదయం పరగడుపున మూడు నుంచి నాలుగు ఆకులను తినాలని దీని వలన షుగర్ కంట్రోల్లో ఉంటుదని వైధ్యులు సూచిస్తున్నారు .
Follow Us On : YouTube , Google News