నేటి తరం ముఖ్యంగా యువత ఇప్పుడు ఎక్కడ చుసిన చెవి లో ఇయర్ ఫోన్స్ తో నో హెడ్ ఫోన్స్ తో నో కనిపిస్తుంటారు సాధారణంగా ఫోన్ ఎక్కువ సేపు మాట్లాడటానికి, ప్రయాణలలో పాటలు వినడానికి హెడ్ ఫోన్స్ ఉపయోగిస్తుంటారు. వాకింగ్, జాగింగ్, వ్యాయామం సమయంలో కూడా ఇవి చెవులకు ఉండాల్సిందే. ఈ ఆధునిక అలవాటుతో వినికిడి శక్తిని కోల్పోయే ప్రమాదం ఉందని ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ (WHO) ఇటీవల ఓ నివేదికలో వెల్లడించింది.
ఇయర్ ఫోన్స్ వద్దు…
అధిక సమయం హెడ్ ఫోన్స్ వాడితే ప్రమాదం బారిన పడినట్లేనని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.కరోనా తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ నేపథ్యంలో ఆఫీస్ వర్క్ చేయాలన్నా, ఆన్లైన్ క్లాసులు చెప్పాలన్నా, వినాలన్నా హెడ్ ఫోన్స్ వాడకం తప్పనిసరై పోయింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 43 కోట్ల మంది వినికిడి లోపంతోబాధపడుతున్నట్లు ‘WHO’ తమ నివేదిక లో వెల్లడించింది. ఇది ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో యువతలో చాలా మందికి వినికిడి సమస్య పెరిగే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్ ఇలా పేరు ఏదైనా వీటిని కర్ణభేరికి అత్యంత దగ్గరగా పెట్టుకోవడం వల్ల బ్యాక్టీరియా, ఫంగస్ చెవులలో పేరుకుపోయి దురద, నొప్పి, చెవిలో చీము కారడం వంటి ఇన్ఫెక్షన్ తలెత్తుతాయని కాబట్టి యువత దేనిని గమనించాలని వారు కోరారు . ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే రానున్న కాలంలో ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా యువత వినికిడి శక్తిని కోల్పోయే ప్రమాదం ఉందని WHO హెచ్చరిస్తోంది. 2050 నాటికి ప్రతీ నలుగురిలో ఒకరు వినికిడి లోపంతో బాధపడే అవకాశం ఉందని తెలిపింది.
Follow Us On : YouTube , Google News