పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన చిత్రం ‘ఆదిపురుష్’. దీనిని డైరెక్టర్ ఓం రౌత్ రామాయణం ఆధారంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ సినిమా జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఎంత సక్సెస్ అయ్యిందో ఎన్ని ట్రోల్ల్స్ వచ్చాయో మనకందరికీ తెలిసందే . రామాయణాన్ని కించపరిచారని వివాదాలను ఎదుర్కొంది. అయితే ఇది పూర్తి రామాయణం కాదని రామాయణాన్ని స్ఫూర్తి గా తీస్కుని తెరకేకించిన చిత్రం అని వారు వివరణ కూడా ఇచ్చారు. హిందూ సంఘాలు కోర్టులో పిటిషన్ కూడా వేశారు. ఎన్ని వివాదాలు వచ్చినా వాటిపై మూవీ టీమ్ ఎవరూ అధికారికంగా స్పందించలేదు.
తాజాగా, ఆదిపురుష్ రైటర్ మనోజ్ ముంతా షిర్ శుక్లా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ” ఆదిపురుష్ సినిమా వల్ల ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని నేను అంగీకరిస్తున్నాను. రెండు చేతులు జోడించి అందరికీ క్షమాపణలు చెబుతున్నాను ” అని అన్నారు . “ప్రభు బజరంగ్ బలి మనల్నందరినీ ఐక్యంగా ఉంచి, దేశానికి సేవ చేయడం కోసం మనకు శక్తిని ప్రసాదిస్తాడని నమ్ముతున్నాను” అంటూ ట్విట్టర్ లో ట్వీట్ చేసాడు . సినిమా రిలీజ్ అయిన 22 రోజుల తర్వాత రైటర్ ఇలా ట్వీట్ చేయడంతో అది చూసిన వారు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
मैं स्वीकार करता हूँ कि फ़िल्म आदिपुरुष से जन भावनायें आहत हुईं हैं.
अपने सभी भाइयों-बहनों, बड़ों, पूज्य साधु-संतों और श्री राम के भक्तों से, मैं हाथ जोड़ कर, बिना शर्त क्षमा माँगता हूँ.
भगवान बजरंग बली हम सब पर कृपा करें, हमें एक और अटूट रहकर अपने पवित्र सनातन और महान देश की…— Manoj Muntashir Shukla (@manojmuntashir) July 8, 2023