చిరంజీవి భోళా శంకర్ సినిమాపై సినీ ప్రియుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 11 ఆగష్టు 2023న విడుదలవుతోంది. అయితే ఈ చిత్రం లోని 2వ పాట కు సంబంధించిన ప్రోమో ఈ రోజు సాయంత్రం రిలీజ్ కాబోతుంది అని చిత్ర యూనిట్ ఆఫీషియల్ గా తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి నుంచి వస్తోన్న `భోళాశంకర్` మూవీపై మాస్లో మంచి క్రేజ్ నెలకొంది. ఇటీవల విడుదలైన టీజర్ ర్యాంపేజ్ లా సాగింది. మాస్ ఆడియెన్స్ కి ఫీస్ట్ లా ఉంది. సినిమా వచ్చే నెలలో రిలీజ్ కాబోతుంది. దీంతో సినిమా నుంచి వరుసగా అప్డేట్లు ఇస్తుంది యూనిట్. ఇప్పటికే టీజర్తోపాటు ఓ సాంగ్ని విడుదల చేశారు. ఇది శ్రోతలను ఆకట్టుకోవడంతోపాటు ఫ్యాన్స్ ని అలరించింది. రెండో పాటకి సంబంధించిన అప్డేట్ ఇచ్చింది యూనిట్.
ఇప్పుడు మరో పాటని విడుదల చేయబోతుంది. తాజాగా చిత్ర బృందం ఆ విషయాన్ని వెల్లడించింది. `జామ్ జజ్జనక` అంటూ సాగే పాటని రిలీజ్ చేయబోతున్నట్టు తెలిపింది. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు సాంగ్ ప్రోమోని, మంగళవారం పాటని విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ని రిలీజ్ చేసింది. ఇందులో చిరంజీవి కలర్ఫుల్ డ్రెస్ ధరించి మాస్ స్టెప్పుతో కనిపిస్తున్నారు. ఇది మాస్ ఆడియెన్స్ కి, చిరు ఫ్యాన్స్ ని ఊర్రూతలూగించేదిగా ఉండబోతుందని అర్థమవుతుంది. సిస్టర్ సెంటిమెంట్తో రూపొందుతున్న `భోళాశంకర్` సినిమాకి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. ఫెయిల్యూర్లో ఉన్న ఆయన ఈ చిత్రంతో దర్శకుడిగా నిరూపించుకోవాలనుకుంటున్నారు. ఇందులో చిరంజీవికి చెల్లిగా స్టార్ హీరోయిన్ కీర్తిసురేష్ నటిస్తుండగా, హీరోయిన్గా తమన్నా నటిస్తుంది. మహతి స్వరసాగర్ దీనికి సంగీతం అందిస్తున్నారు.
ఈ చిత్రం తమిళ హిట్ వేదాళం యొక్క రీమేక్ మరియు తమన్నా కథానాయికగా నటిస్తుండగా, కీర్తి సురేష్ చిరంజీవి సోదరి పాత్రను పోషిస్తోంది. చిరంజీవి ఈ చిత్రంలో తన పాత్రకు డబ్బింగ్ ముగించారు మరియు ఇప్పటికే సెలవులకు అని ఫ్యామిలీ ట్రిప్ కోసం విదేశాలకు వెళ్లిపోయారు మెగాస్టర్ . ఈలోగా, మేకర్స్ ఈ సినిమా సెకండ్ సింగిల్కి సంబంధించిన అప్డేట్తో ముందుకు వచ్చారు. వారు “స్టైకింగ్ టీజర్ ది చార్ట్బస్టర్ #BholaaMania నౌ తర్వాత, #BholaaShankar నుండి సెలబ్రేషన్ సాంగ్ కోసం సిద్ధంగా ఉండండి ప్రకటన లోడ్ అవుతోంది త్వరలో వేచి ఉండండి. మహతి స్వర సాగర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సుశాంత్, రఘుబాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, సురేఖా వాణి, శ్రీ ముఖి, హైపర్ ఆది, వైవా హర్ష కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై ఈ చిత్రం అత్యంత విలాసవంతమైన రీతిలో నిర్మించబడింది.