బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసు నేడు సుప్రీంకోర్టు వాయిందా వేసింది. లిక్కర్ కుంభకోణంలో తనకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన సమన్లు రద్దు చేయలాంటూ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తనను ముందస్తు అరెస్ట్ చేయవద్దని కూడా కవిత తన పిటీషన్ లో పేర్కొన్నారు. ఈరోజు సుప్రీంకోర్టులో కవిత పిటీషన్ విచారణకు రావాల్సి ఉంది.
జస్టిస్ లు అందుబాటులో లేక…
అయితే కోర్టు నెంబరు 2, 8 కార్యకలాపాలు రద్దు కావడం, ఈ కేసును విచారించాల్సిన జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ అందుబాటులో లేకపోవడంతో కోర్టు నెంబరు 2 కార్యకలాపాలు వాయిదా పడ్డాయి. ఈ కోర్టు విచారించాల్సిన అంశాలు వాయిదా పడినట్లు సుప్రీంకోర్టు అఫిషియల్ గా ప్రకటించింది. జస్టిస్ ఎస్. రవీంద్ర భట్ కూడా అందుబాటులో లేకపోవడంతో ఆ కోర్టులో విచారించాల్సిన అంశాలు కూడా వాయిదా పడ్డాయి. రద్దయిన కేసుల విచారణ తేదీలను త్వరలో తెలియపరుస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. కవిత కేసు కూడా ఎప్పుడు విచారణకు వచ్చేది త్వరలోనే తెలియనుంది.