అమెరికాలో జరుగుతున్న తానా సభల్లో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమయిందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళితులకు, గిరిజనులకు పెద్దపీట వేస్తామన్న రేవంత్ రెడ్డి వారి సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు. గిరిజన జాతికి చెందిన ములుగు ఎమ్మెల్యే సీతక్క ను ముఖ్యమంత్రిని చేస్తామని ఆయన సంచలన ప్రకటన చేశారు.
పోలవరం కూడా…
తానా సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డిని ఎన్నారైలు కొన్ని ప్రశ్నలు అడిగారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కొన్ని అంశాల గురించి కూడా రేవంత్ రెడ్డి జవాబిచ్చారు. పోలవరం ప్రాజెక్టు తామే పూర్తి చేస్తామన్న రేవంత్ రెడ్డి రాజధాని అమరావతిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే నిర్మిస్తుందని తెలిపారు. పోలవరం, అమరావతిల నిర్మాణంపై తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పటికే ఏపీ ప్రజలకు హామీ
ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.