జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఏపీ మహిళ కమిషన్ నోటీసులు జారీ చేసింది. వాలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఖండించారు. ఆధారాలు లేని ఆరోపణలు చేయడం సరికాదంటూ పవన్ కు హితవు పలికారు. వారాహి యాత్రలో సభల్లో ప్రసంగిస్తున్న పవన్ కల్యాణ్ వాలంటీర్ల కారణంగా ఏపీలో ముప్ఫయి వేల మంది మహిళలు అదృశ్యమయ్యారంటూ చేసిన ఆరోపణలపై ఏపీ మహిళ కమిషన్ స్పందించింది.
పది రోజుల్లోగా…
పవన్ కల్యాణ్ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారంటూ వాసిరెడ్డి పద్మ ఫైర్ అయ్యారు. పది రోజుల్లోపు తన వ్యాఖ్యలకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలని మహిళ కమిషన్ పవన్ కల్యాణ్ కు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు. పది రోజుల్లో వివరణ ఇవ్వకుంటే బేషరతుగా మహిళలందరీకీ క్షమాపణ చెప్పాలని మహిళ కమిషన్ తెలిపింది. పవన్ వ్యాఖ్యలు ఒంటరి మహిళల ఆత్మగౌరవాన్ని కించపర్చేలా ఉన్నాయని అభిప్రాయపడింది.