రాజధాని అమరావతి కేసును సుప్రీంకోర్టు డిసెంబరుకు వాయిదా వేసింది. ఈ కేసును అత్యవసరంగా విచారించాలన్నరాష్ట్రప్రభుత్వం విజ్ఞప్తిని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. స్టేట్ గవర్నమెంట్ విజ్ఞప్తిని తిరస్కరించింది. నవంబరు నెల వరకూ రాజ్యాంగ ధర్మాసనంలో కేసులున్నందున ఈకేసును డిసెంబరులోపు విచారణ సాధ్యం కాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
సమయం లేదంటూ…
రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిని నిర్ణయించుకునే అధికారం లేదన్న హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని కోరింది. శాసనసభ ఆమోదం మేరకు మూడు రాజధానులను నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని తెలుపుతూ ఈపిటీషన్ ను దాఖలు చేసింది. ఈ కేసును త్వరగా పూర్తి చేయాలని కోరింది. కానీ సుప్రీంకోర్టు మాత్రం ఈకేసును వెంటనే విచారించేందుకు తగిన సమయం లేదని చెబుతూ కేసును డిసెంబరుకు వాయిదా వేసింది.