ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి కీలకమైన ఎజెండాను సిద్ధం చేశారు. ఈ మంత్రి వర్గ సమావేశంలో తొమ్మిది వేల ఎకరాల లంక భూములను పంథొమ్మిది వేల మంది లబ్దిదారులకు పట్టాలు ఇచ్చే అంశాన్ని ఆమోదించనుంది. ఎజెండాలో మొత్తం డెబ్భయి వరకూ అంశాలు చేర్చారు.
రాజధానిలో ఇళ్లు…
ఇందులో హైడ్రో స్టోరేజీ, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులతో పాటు హోటళ్లు,రిసార్టుల ఏర్పాటుకు మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలపనుంది. అలాగే ఆలయాల్లో ఉద్యోగుల వయసును కూడా 62ఏళ్లకు పెంచడంపై సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. రాజధాని అమరావతిలో పేదల ఇళ్ల నిర్మాణంపై కూడా ఈ సమావేశం తర్వాత ఒక నిర్ణయం వెలువడే అవకాశముంది. టైం బౌండ్ ప్రణాళికతో ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి కూడా సమావేశం తర్వాత క్లారిటీ వచ్చే అవకాశముంది.