ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ లో జరిగిన పంచాయతీ ఎన్నికలలో అధికార తృణమూల్ కాంగ్రెస్ వన్ సైడ్ విక్టరీ దిశగా వెళుతుంది. పోలింగ్ సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నప్పటికీ ప్రజలు టీఎంసీ వైపు మొగ్గు చూపారని ఎన్నికల ఫలితాలద్వారా వెల్లడవుతుంది. 70 వేలకు పైగా ఉన్న పంచాయతీల్లో ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ సగం పంచాయతీల్లో పాగా వేసింది.
రెండో స్థానంలో…
ఆ తర్వాత స్థానంలో బీజేపీ ఉంది. బీజేపీ ఏడు వేల పైచిలుకు పంచాయతీలను కైవసం చేసుకుంది. సీపీఎం రెండువేలు. కాంగ్రెస్ రెండు వేల వరకూ పంచాయతీల్లో గెలిచింది. ఇంకా కౌంటింగ్ కొనసాగుతుంది. మిగిలిన పంచాయతీల్లోనూ టీఎంసీదే పైచేయి అవుతుందని చెబుతున్నారు. ప్రజలు అధికార పార్టీ వైపు చూస్తున్నారని ఈ ఎన్నికల ద్వారా మరోసారి అర్థమయిందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ అన్నారు.
భారీ భద్రత…
ఓట్ల లెక్కింపు జరిగే కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలింగ్ సందర్భంగా జరిగిన హింసలో పదిహేను మంది వరకూ మృతి చెందారు. కౌంటింగ్ సమయంలోనూ అక్కడక్కడ ఘర్షణలు చోటు చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే భారీ భద్రతను ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ విధించి అనుమానితులను ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. మమత బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పంచాయతీ ఎన్నికల్లోనూ తన సత్తా చూపించుకుందని ఈ ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి.