తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మినీ మేనిఫేస్టో గురించి మీడియాకు వివరించారు. ఆయన మీడియా మిత్రులతో ఇష్టాగోష్టి మాట్లాడారు. మినీ మ్యానిఫేస్టోలో రూపొందించిన పూర్ టు రిచ్ విధానం విన్ననూత్నమైనదని చంద్రబాబు అన్నారు. ఈ విధానంతో ప్రజల్లో ఉన్న పేదరికాన్ని త్వరగా రూపుమాపే అవకాశాలున్నాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రజలతో పాటు ప్రభుత్వం, ప్రయివేటు సంస్థలు భాగస్వామ్యులవుతాయని తెలిపారు.
అద్భుతమైన ఫలితం…
దీనినే పీ 4 విధానం అని వ్యవహరిస్తామని చంద్రబాబు తెలిపారు. పేదలకు ఇప్పుడు రోజుకు నూట యాభై రూపాయలు మాత్రమే వస్తుందని, పేదలకు రోజువారీ వచ్చే రాబడిని పెంచడమే ఈ విధానం ముఖ్య ఉద్దేశ్యమని చంద్రబాబు వివరించారు. సంపదను సృష్టించడం ద్వారానే పేదరికం పోగొట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు. పూర్ టు రిచ్ విధానాన్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టమని, అయితే ఆచరణలో ఇది అద్భుతమైన ఫలితం ఇస్తుందని తెలిపారు.