మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నాసిక్ లోని సప్తశృంగి గద్గాట్ ఘాట్ వద్ద బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు ఇప్పటి వరకూ అందిన సమాచారం. దాదాపు ఇరవై మంది వరకూ గాయాలపాలయ్యారని తెలుస్తోంది. సప్తశృంగికోట వద్ద బస్సు లోయలో పడింది. అమ్మవారిని దర్శించుకునే బస్సు ప్రమాదానికి గురి కావడంతో భక్తులు తీవ్ర గాయాలపాలయ్యారు. సమాచారం తెలిసిన వెంటనే స్థానికులతో పాటు ఎన్.డి.ఆర్.ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలను ప్రారంభించారు.
అతి వేగమే…
గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి ప్రత్యక్ష సాక్షులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వర్షం కారణంగా సహాయక చర్యలకు కొంత ఆటంకం ఏర్పడిందని పోలీసు అధికారులు చెప్పారు. మితిమీరిన వేగం కారణంగా బస్సు లోయలో పడిందని పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.